త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | లండ‌న్ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్నా.. వ‌చ్చాక‌ అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్‌

Revanth Reddy | మ‌రికొన్ని గంట‌ల్లో లండ‌న్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్నాన‌ని.. వ‌చ్చాక అన్ని అంశాల‌పై మాట్లాడ‌తాన‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లండన్‌ సమావేశాలు, షెడ్యూల్ చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముగిశాయ‌ని తెలిపారు.

S

Telangana | Published On Aug 23, 2026, 5.33 pm IST

Revanth Reddy | లండ‌న్ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్నా.. వ‌చ్చాక‌ అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: మ‌రికొన్ని గంట‌ల్లో లండ‌న్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్నాన‌ని.. వ‌చ్చాక అన్ని అంశాల‌పై మాట్లాడ‌తాన‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లండన్‌ సమావేశాలు, షెడ్యూల్ చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముగిశాయ‌ని తెలిపారు. గత మూడు రోజులుగా ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎంతో మద్దతు ల‌భించింద‌న్నారు. రాజ‌కీయ కోణంలోనే త‌న అమెరికా ప‌ర్య‌ట‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న ఆదివారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

షెడ్యూల్ ప్రకారం బోస్టన్‌కు వెళ్లవలసి ఉండగా కేంద్రం అనుమ‌తించ‌పోవ‌డంతో వెన‌క్కి వ‌స్తున్న‌ట్లు చెప్పారు.జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ ప‌ర్య‌ట‌న‌లో త‌న‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు, పార్టీకి, నాయకుల‌కు, ప్రజలందరికీ కృతజ్ఞత‌లు తెలిపారు.

Advertisement
Advertisement