Minister Seethakka | ఎల్ నినో ముప్పు ఉన్నా.. గుక్కెడు నీటికి గోస రానివ్వం
రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమైనా, ఎల్ నినో ప్రభావం ఉన్నా తాగునీటి కొరత రానివ్వబోమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ప్లాన్ ఇదే!
- వర్షాలు తగ్గినా, ఎల్ నినో ముప్పు ఉన్నా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు యాక్షన్ ప్లాన్
- 29 రిజర్వాయర్లలో నీటి నిల్వలపై రోజువారీ పర్యవేక్షణ, ఇరిగేషన్ శాఖ అధికారులతో నిరంతర సమన్వయం
- సింగూర్లో నీటి మట్టం తగ్గడంతో సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశం
- స్థానిక నీటి వనరుల వినియోగం, అవసరమైతే బోరుబావులు (Borewells) లోతు పెంచడం లేదా అద్దెకు తీసుకోవడం
- తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
Minister Seethakka | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో వర్షాలు (Rains) కాస్త ముఖం చాటేస్తున్నా, ఎల్ నినో (El Nino) వంటి వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్నా.. రాష్ట్ర ప్రజలకు గుక్కెడు నీటికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో తాగునీటి సంక్షోభం (Drinking Water Crisis) తలెత్తనివ్వబోమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ బోర్డు సమావేశంలో అధికారులకు ఆమె పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రిజర్వాయర్లపై డైలీ మానిటరింగ్
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి వచ్చే ఉపరితల జలాలను శుద్ధి చేసి అందిస్తున్నారు. ప్రస్తుతం 29 రిజర్వాయర్ల ద్వారా 123 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు (Water Treatment Plants) నీరు సరఫరా అవుతోంది. రాబోయే 45, 90, 180 రోజుల అవసరాలకు ఈ నీరు సరిపోతుందా లేదా అనేదానిపై మంత్రి సమీక్షించారు. నీటి మట్టాలను ప్రతిరోజూ మానిటరింగ్ (Monitoring) చేస్తూ.. ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జూలై నెలాఖరుకల్లా తగినంత వరద రాకపోతే.. అక్కంపల్లి నుంచి ఉదయసముద్రానికి, తుపాకులగూడెం నుంచి దుమ్ముగూడెంకు నీటిని విడుదల చేసుకునేలా కో-ఆర్డినేట్ (Coordinate) చేసుకోవాలని చెప్పారు.

సింగూర్ ఆయకట్టుపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో (Singur Project) నీటి నిల్వలు ఆందోళనకరంగా పడిపోయాయి. రాబోయే 45 రోజుల్లో తగినంత వరద రాకపోతే సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే ముప్పు ఉందని అధికారులు వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన సీతక్క.. ఆయా ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ (Groundwater) ఆధారిత ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

బోరుబావులు అద్దెకైనా తీసుకోవాలి
స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక వనరులు లేని ప్రాంతాల్లో బోర్వెల్స్ (Borewells) లోతు పెంచడం, వాటిని ఫ్లషింగ్ చేయడం లేదా ప్రైవేట్ నుంచి అద్దెకు తీసుకోవడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి నిరంతరాయంగా సురక్షితమైన తాగునీరు అందేలా ముందస్తు చర్యలు పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

VB-G RAM G | వీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
జూన్ 27, 2026

Telangana Disabled Welfare | కొత్త జీవితం వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లులు
జూన్ 27, 2026

Minister Seethakka | గ్రామీణ తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి సీతక్క
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●AMMA | ‘అమ్మా’కు రేవతి, పద్మప్రియ గుడ్బై.. భద్రత, గౌరవం కల్పించడంలో విఫలమైందని ఆరోపణలు
- ●Telugu Serial Actor | ప్రియురాలితో తెలుగు సీరియల్ హీరో ఎంగేజ్మెంట్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు
- ●Water problems in Telangana | జూలై దాటితే తాగు నీటికీ కటకటే
- ●DGP Anand | గంజాయి ఎక్కువ సీజ్ చేసిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి.. రవాణాకు ఇదే ప్రవేశమార్గంలా ఉంది: డీజీపీ సీవీ ఆనంద్
- ●Kalvakuntla Kavitha New Party | ఢిల్లీ హైకోర్టులో కవితకు భారీ షాక్.. 'టీఆర్ఎస్' పార్టీకి బ్రేక్
- ●Drumstick Business | మునగకాయల వ్యాపారం.. ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్న యువకుడు

AMMA | ‘అమ్మా’కు రేవతి, పద్మప్రియ గుడ్బై.. భద్రత, గౌరవం కల్పించడంలో విఫలమైందని ఆరోపణలు

Telugu Serial Actor | ప్రియురాలితో తెలుగు సీరియల్ హీరో ఎంగేజ్మెంట్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు

Water problems in Telangana | జూలై దాటితే తాగు నీటికీ కటకటే

DGP Anand | గంజాయి ఎక్కువ సీజ్ చేసిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి.. రవాణాకు ఇదే ప్రవేశమార్గంలా ఉంది: డీజీపీ సీవీ ఆనంద్


