DGP Anand | గంజాయి ఎక్కువ సీజ్ చేసిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి.. రవాణాకు ఇదే ప్రవేశమార్గంలా ఉంది: డీజీపీ సీవీ ఆనంద్
DGP Anand | రాష్ట్రంలో అత్యధికంగా గంజాయి సీజ్ చేసిన జిల్లాల్లో ఖమ్మం ఒకటని.. ఈ జిల్లా గంజాయి రవాణాకు ప్రవేశమార్గంలా ఉందని డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవేశ మార్గాలను బ్లాక్ చేస్తే గంజాయి అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.
DGP Anand | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో అత్యధికంగా గంజాయి సీజ్ చేసిన జిల్లాల్లో ఖమ్మం ఒకటని.. ఈ జిల్లా గంజాయి రవాణాకు ప్రవేశమార్గంలా ఉందని డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవేశ మార్గాలను బ్లాక్ చేస్తే గంజాయి అరికట్టడం సాధ్యమేనని చెప్పారు. ఇక్కడి పోలీసు అధికారులు దీనిపై దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం ఆయన ఖమ్మంలో పర్యటించారు. జిల్లాలోని నేరాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కేసుల్లో దర్యాప్తు సమగ్రంగా ఉండాలన్నారు. నేరస్థులను అరెస్టు చేయడమే కాకుండా వారికి తగిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. సాంకేతికతను మరింత అందిపుచ్చుకోవాలని.. బలమైన పోలీసింగే లక్ష్యంగా ఉండాలన్నారు.

జిల్లాలో ఆర్థిక మోసాలు 30%, ఉద్యోగ మోసాలు 36%, నకిలీ పత్రాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జీఎస్టీ (GST) నేరాలు కూడా ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయి. ఈ ఏడాది సైబర్ నేరాల వల్ల 711 మంది బాధితులు రూ. 9.48 కోట్లు కోల్పోయారు. ఇప్పటివరకు రూ.1.41 కోట్లు రికవరీ అయ్యాయి. ఈ ఏడాది 1,700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. రోడ్ సేఫ్టీ పార్కును, జిల్లా కమాండ్ సెంటర్కు అనుసంధానించిన 250 కొత్త సీసీటీవీ (CCTV) కెమెరాలను, కమిషనరేట్ సీసీటీవీ కమాండ్ ఫెసిలిటీని ప్రారంభించాం. తమ సొంత గ్రామాల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకున్న పౌరులను అభినందనలు. గతేడాది రోడ్డు ప్రమాదాలు 317 ఉండగా, ఈ ఏడాది 146కి తగ్గాయి. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాం. విద్యార్థులకు ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించి, హెల్మెట్లను పంపిణీ చేశాం అని డీజీపీ ఆనంద్ తెలిపారు.

మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రకటించి రాబోయే తరాలను కాపాడాలి. న్యాయం అనేది మొదట పేదలకు, నిరుపేదలకు అందాలి. రాత్రిపూట పెట్రోలింగ్ను బలోపేతం చేయాలి. సివిల్, భూ వివాదాల్లో ఎలాంటి జోక్యం చేసుకోవద్దు. ఎలాంటి మినహాయింపులు లేకుండా ఎస్ఓపీలను (SOPs) అమలు చేయాలి. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రౌడీ మూకలపై చర్యలు (targeted action) ఉండాలి. దీనికి CCTNS 3.0, హాక్ ఐ 3.0 (Hawk Eye 3.0), TG COPS 3.0 సాంకేతికత అండగా ఉంటుంది. 'ఈగల్' (EAGLE) తరహాలోనే త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ బ్యూరో రాబోతోంది. యూనిఫాం ధరించడం గొప్ప అదృష్టం. 4.5 కోట్ల జనాభాలో కేవలం 0.16% మందికే ఈ అవకాశం ఉంటుంది. యూనిఫాంను పూర్తి నిబద్ధతతో ధరించండి, లేదంటే తీసేయండి అంటూ ఘాటుగా హెచ్చరించారు.
తాజావార్తలు
- ●AMMA | ‘అమ్మా’కు రేవతి, పద్మప్రియ గుడ్బై.. భద్రత, గౌరవం కల్పించడంలో విఫలమైందని ఆరోపణలు
- ●Telugu Serial Actor | ప్రియురాలితో తెలుగు సీరియల్ హీరో ఎంగేజ్మెంట్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు
- ●Water problems in Telangana | జూలై దాటితే తాగు నీటికీ కటకటే
- ●Kalvakuntla Kavitha New Party | ఢిల్లీ హైకోర్టులో కవితకు భారీ షాక్.. 'టీఆర్ఎస్' పార్టీకి బ్రేక్
- ●Drumstick Business | మునగకాయల వ్యాపారం.. ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్న యువకుడు
- ●Minister Vivek | లేబర్ కోడ్లపై తొందరపాటు నిర్ణయాలు ఉండవ్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

AMMA | ‘అమ్మా’కు రేవతి, పద్మప్రియ గుడ్బై.. భద్రత, గౌరవం కల్పించడంలో విఫలమైందని ఆరోపణలు

Telugu Serial Actor | ప్రియురాలితో తెలుగు సీరియల్ హీరో ఎంగేజ్మెంట్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు

Water problems in Telangana | జూలై దాటితే తాగు నీటికీ కటకటే

Kalvakuntla Kavitha New Party | ఢిల్లీ హైకోర్టులో కవితకు భారీ షాక్.. 'టీఆర్ఎస్' పార్టీకి బ్రేక్





