Telangana DGP | ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు.. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు
Telangana DGP | ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న పోలీసు సిబ్బంది ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం నేపథ్యంలో పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఆత్మహత్యలు వద్దంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు.
కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలు పంచుకోండి
సమస్యలుంటే అధికారులను సంప్రదించండి
సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా
పోలీసు సిబ్బందికి డీజీపీ సీవీ ఆనంద్ సందేశం
Telangana DGP | త్రినేత్ర.న్యూస్ : ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న పోలీసు సిబ్బంది ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం నేపథ్యంలో పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఆత్మహత్యలు వద్దంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు నెలల్లో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువ, మధ్య వయస్కులైన కానిస్టేబుళ్లు ఇటువంటి ఘటనలకు పాల్పడటం మరింత బాధాకరమన్నారు.
ఈ ఘటనలపై జరిపిన విచారణలో ఆన్లైన్ బెట్టింగ్ మూలంగా అప్పులపాలవడమే ప్రధాన కారణంగా తేలిందని డీజీపీ పేర్కొన్నారు. కొందరు భూములు అమ్ముకోగా.. మరికొందరు స్నేహితులు, సహోద్యోగుల వద్ద అప్పులు చేశారని తెలిపారు. ఇంకొందరు అధిక వడ్డీకి డబ్బులు తీసుకున్నారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కారణంగా ఆత్మహత్యే పరిష్కారమని భావించడం విషాదకరమన్నారు.
వ్యసనాలు వద్దు.. కుటుంబమే ముద్దు
తమ వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా తమ ఆర్థిక పరిస్థితి, అప్పుల వివరాలను జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే వాటిని దాచిపెట్టకుండా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై శాఖ తరఫున ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని డీజీపీ తెలిపారు. బెట్టింగ్కు దూరంగా ఉండటంతోపాటు మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి పరిష్కారం పొందాలని చెప్పారు.
93 వేల మంది సిబ్బందికి విజ్ఞప్తి
ఆత్మహత్యలు వద్దు అంటూ.. తెలంగాణ పోలీసు శాఖలోని 93,000 మంది సిబ్బందికి డీజీపీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం, డ్రగ్స్, గంజాయి తదితర సామాజిక దురలవాట్లకు కూడా దూరంగా ఉండాలని కోరారు.
మీపై పూర్తిగా ఆధారపడి ఉన్న మీ కుటుంబాన్ని, మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు మీ ఆత్మహత్యతో బాధను మిగిల్చవద్దన్నారు. మీరు లేకపోతే మీ కుటుంబం బాగోగులను ఎవరు చూస్తారు.. దయచేసి ఆలోచించండి అని డీజీపీ సి.వి. ఆనంద్ పోలీసు సిబ్బందికి హత్య ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా జీవించాలి... అంటూ సిబ్బందికి పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..
సెప్టెంబర్ 10, 2026

KTR | మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందే.. అప్పటి వరకు రేవంత్ను వదిలిపెట్టం : కేటీఆర్
సెప్టెంబర్ 7, 2026

KTR | అక్కల పట్ల పోలీసుల తీరు దారుణం.. రేవంత్రెడ్డిపై కేటీఆర్ ఫైర్
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●TGEJAC | ఓపీఎస్ను పునరుద్ధరించండి సీఎం గారు.. టీజీఈజేఏసీ విజ్ఞప్తి
- ●CM Revanth Reddy | సభకు రండి.. లేదంటే రాజకీయంగా రాణించలేరు
- ●Tamil OTT | తెలుగులో రిలీజైన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
- ●Malavika Mohanan | దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ - త్రిష నుంచి మెసేజ్ - సీక్రెట్ రివీల్ చేసిన మాళవికా మోహనన్
- ●Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?
- ●CS Sanjay Jaju | ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..

TGEJAC | ఓపీఎస్ను పునరుద్ధరించండి సీఎం గారు.. టీజీఈజేఏసీ విజ్ఞప్తి

CM Revanth Reddy | సభకు రండి.. లేదంటే రాజకీయంగా రాణించలేరు

Tamil OTT | తెలుగులో రిలీజైన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

Malavika Mohanan | దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ - త్రిష నుంచి మెసేజ్ - సీక్రెట్ రివీల్ చేసిన మాళవికా మోహనన్



