త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Budget | తెలంగాణ బ‌డ్జెట్ రూ. 3,24,234 కోట్లు

Telangana Budget | 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 3,24,234 కోట్ల‌తో ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్టారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని భ‌ట్టి విక్ర‌మార్క చ‌దివి వినిపిస్తున్నారు.

S

Telangana | Published On Mar 20, 2026, 12.14 pm IST

Telangana Budget | తెలంగాణ బ‌డ్జెట్ రూ. 3,24,234 కోట్లు
Advertisement

Telangana Budget | త్రినేత్ర‌.న్యూస్ : 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 3,24,234 కోట్ల‌తో ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్టారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని భ‌ట్టి విక్ర‌మార్క చ‌దివి వినిపిస్తున్నారు. బ‌డ్జెట్ అంటే సంఖ్య‌ల చుట్టూ తిరిగే అంకెలు కాదు.. ప్ర‌జ‌ల చుట్టూ తిరిగే సంఖ్య‌లు అని ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ బ‌డ్జెట్ రూ. 3,24,234 కోట్లు
మూల‌ధ‌న వ్య‌యం రూ. 47,267 కోట్లు
రెవెన్యూ వ్య‌యం రూ. 2,34,406 కోట్లు

ప్ర‌తి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజ‌కీయ న్యాయం అందించ‌డ‌మే మా ప‌రిపాల‌న ల‌క్ష్యం. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ మా పాల‌న సాగిస్తున్నాం. మేం పాల‌కులం కాదు ప్ర‌జ‌ల‌కు సేవ‌కులం. అధికారాన్ని భాద్య‌త‌గా భావించి అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతున్నాం. మేం ఇచ్చిన వాగ్దానాల‌ను సంతృప్తిక‌ర‌మైన స్థాయిలో నెర‌వేర‌స్తున్నాం. ఆర్థిక విధ్వంసాన్ని స‌రిచేస్తూ పాల‌న‌ను గాడిలో పెట్టాం. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తూ.. శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నాం. దేశంలో నంబ‌ర్ స్థానంలో తెలంగాణ‌ను నిల‌బెట్టాల‌న్న‌దే మా ల‌క్ష్యం. అందుకోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాం. ఈ రెండేండ్ల‌లో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్ట‌బ‌డులు తీసుకురాగ‌లిగాం అని భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

మేం ఎంచుకున్న ల‌క్ష్యాల వైపు ఆటంకాల‌ను అధిగమించి ముందుకు సాగుతున్నాం. ప‌న్నుల‌ను ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాం. ప్ర‌తిపైసాకు కాప‌లాదారుగా ఉంటున్నాం. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌నే ప‌ట్టుద‌ల మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. తెలంగాణ ప్ర‌జానీక అభ్యున్న‌తి ప‌ట్ల ఈ బ‌డ్జెట్‌ను చిత్త‌శుద్ధితో రూప‌క‌ల్ప‌న చేశాం. బ‌డ్జెట్ అంటే సంఖ్య‌ల చుట్టూ తిరిగే అంకెలు కాదు. ప్ర‌జ‌ల చుట్టూ తిరిగే సంఖ్య‌లు. ప్ర‌జ‌ల స్థితిగతుల మార్పున‌కు దోహ‌ద‌ప‌డే అంకెలు. రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి అద్దం ప‌ట్టేలా రూపొందించాం. పార‌ద‌ర్శ‌క‌త‌తో పాల‌న సాగిస్తున్నాం. గొప్ప‌ల కోసం అబ‌ద్ధాలు చెప్పం. మభ్య‌పెట్టే మాయ‌మాట‌లు చెప్పం. ప్ర‌శ్నించిన వారిని దూషించ‌డం మా నైజం కాదు. ఇది ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల మాకున్న చిత్త‌శుద్ధి అని భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement