Speaker Gaddam Prasad Kumar | దౌర్జన్యంగా మైక్ లాక్కున్నారు.. సభలో స్పీకర్ ఆవేదన
Speaker Gaddam Prasad Kumar | శాసనసభలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దౌర్జన్యంగా మైక్ లాక్కుని మాట్లాడారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Speaker Gaddam Prasad Kumar | త్రినేత్ర.న్యూస్ : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి శాసనసభలో 22ఏ భూమూలపై మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్పై ఆరోపణలు చేశారు. ఏలేటి వ్యాఖ్యలపై శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకుని.. మీరు అడగ్గానే మైక్ ఇచ్చారు(స్పీకర్ను ఉద్దేశించి). సలహాలు, సూచనలు ఇస్తారని అవకాశం ఇస్తే.. పర్సనల్ అటాక్ మంచిది కాదు. కంక్లూజన్ చేయమనండి అని స్పీకర్కు సూచించారు.
నేను మైక్ ఇవ్వలేదు..
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కల్పించుకుని.. నేను మైక్ ఇవ్వలేదు.. సాంబశివరావుకు మైక్ ఇచ్చాను. కానీ దౌర్జన్యంగా లాక్కుని మాట్లాడుతున్నారు అని వివరణ ఇచ్చారు.
ఇలా చేయడం కరెక్టేనా..?
పర్సనల్గా అటాక్ చేయడం లేదు. బాధ్యాయుతమైన పదవిలో ఉన్నవారు.. ఇలా చేయడం కరెక్టేనా అని అడుగుతున్నాను అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
అది సరికాదు.. ముగించండి..
మళ్లీ శ్రీధర్ బాబు కలగజేసుకుని.. 22ఏకు సంబంధించిన అంశంలో రెవెన్యూ మంత్రి స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ పదేపదే లేని అంశాన్ని లేవనెత్తుతున్నారు, అది సరికాదు.. ముగించండి, మా సభ్యులు కూడా మాట్లాడాల్సి ఉంది.. సీఎం వివరణ ఇవ్వాల్సి ఉందని శ్రీధర్ బాబు అన్నారు.
ఒకే మైక్ ఇవ్వకండి..
ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రసంగం ముగిసిన అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఒకే సీటులో ఇద్దరికి అవకాశం కల్పించడం బాగుంది.. కానీ ఒకే మైక్ ఏర్పాటు చేయడం బాగాలేదు. ఇక నుంచి ప్రతి సభ్యుడికి ఒక మైక్ ఏర్పాటు చేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేయగా.. సభలో నవ్వులు విరిశాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Congress MLA Rammohan Reddy | మన గౌరవ ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షా
సెప్టెంబర్ 16, 2026

Alleti Maheshwar Reddy | ఇది క్విడ్ ప్రోకో కాదా..? రాఘవ కన్స్ట్రక్షన్పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
సెప్టెంబర్ 16, 2026

Bandi Sanjay | బీఆర్ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదు..?
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్కు పెయిడ్ ప్లాన్స్..
- ●CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు
- ●KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా
- ●Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!
- ●Congress MLA Rammohan Reddy | మన గౌరవ ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షా
- ●Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక

Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్కు పెయిడ్ ప్లాన్స్..

CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు

KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా

Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!



