త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Speech OP Jindal Global University | “స్టార్టప్ స్టేట్”గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా

హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో 'స్టార్టప్ స్టేట్' అంశంపై కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు.

J

Telangana | Published On Sep 16, 2026, 2.02 pm IST

KTR Speech OP Jindal Global University | “స్టార్టప్ స్టేట్”గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా

సంక్షిప్త సారాంశం

హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ప్రఖ్యాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. యూనివర్సిటీ వీసీ రాజ్ కుమార్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. "ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్" అనే అంశంపై విద్యార్థులు, ఫ్యాకల్టీని ఉద్దేశించి కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణం, టెక్నాలజీ ఆధారిత పాలన, సమ్మిళిత వృద్ధి గురించి ఈ వేదికపై వివరించారు.

Advertisement

KTR Speech OP Jindal Global University | త్రినేత్ర.న్యూస్ : హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ప్రఖ్యాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రత్యేకంగా పర్యటించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డా.సి.రాజ్ కుమార్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.

KTR Delivers Distinguished Public Lecture at OP Jindal

"ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్"

ఈ వేదికగా “ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్” అనే ఆసక్తికరమైన అంశంపై కేటీఆర్ విశిష్ట ప్రజా ఉపన్యాసం (Distinguished Public Lecture) అందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో సంస్థల నిర్మాణం, టెక్నాలజీ ఆధారిత పాలనా విధానాలు, అందరినీ కలుపుకుపోయే సమ్మిళిత వృద్ధి (Inclusive Growth) సాధించిన తీరును ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఉత్సాహపరిచారు.

KTR Delivers Distinguished Public Lecture at OP Jindal

 

ప్రతిష్టాత్మక ఆహ్వానం మేరకే పర్యటన

గతంలోనే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ఆగస్టు, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో తమ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించాలని వీసీ రాజ్ కుమార్ కోరడంతో పాటు.. భారతదేశపు మొదటి రాజ్యాంగ మ్యూజియం (Constitution Museum), రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు తాజాగా యూనివర్సిటీని సందర్శించిన కేటీఆర్.. విద్యార్థులకు తన అనుభవాలను పంచుకుంటూ దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement