Gig Workers | గిగ్ వర్కర్ల బిల్లుకు శాసనసభ ఆమోదం
Gig Workers | గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శాసనసభలో ప్రవేశపెట్టగా చర్చ అనంతరం ఆమోదం తెలిపింది.
గిగ్ వర్కర్లను పట్టించుకోవాలి
లేదంటే అగ్రిగేటర్లకు పెనాల్టీ విధిస్తాం
ఈ చట్టం వల్ల కంపెనీలకు ఎలాంటి నష్టం ఉండదు
ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్
శాసనసభలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెల్లడి
Gig Workers | త్రినేత్ర.న్యూస్ : గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శాసనసభలో ప్రవేశపెట్టగా చర్చ అనంతరం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్లను పట్టించుకోకపోతే అగ్రిగేటర్లకు పెనాల్టీ వేస్తాం. మొదటిసారి తప్పు చేస్తే రూ. 50 వేలు, రెండోసారి తప్పుచేస్తే రూ. లక్ష, మూడోసారి తప్పు చేస్తే రూ. లక్షా 50 వేలు జరిమానా విధిస్తాం. గిగ్ వర్కర్లతో మాట్లాడి డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేశాం. ఈ బిల్లు రూపొందించేందుకు ఐదుసార్లు సమావేశాలు నిర్వహించాం. ఈ చట్టం వల్ల కంపెనీలకు ఎలాంటి నష్టం ఉండదు. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు.
బిల్లులోని ముఖ్యాంశాలు ఇవే..
- గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, పర్యవేక్షణకు ‘సామాజిక భద్రత , సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలు, దివ్యాంగులకు ప్రాతినిధ్యం ఉంటుంది.
- ప్లాట్ఫాం ఆధారిత కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఐడీ) కేటాయిస్తారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా వారికి అందుతాయి.
- అగ్రిగేటర్లు (సంస్థలు) జరిపే లావాదేవీల నుంచి 1శాతం నుంచి 2 వరకు నిధులను సేకరించి, వాటిని సంక్షేమ నిధికి జమ చేస్తారు. ఈ నిధిని కార్మికుల బీమా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ , పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.
- యాజమాన్యాలకు, కార్మికులకు మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించేందుకు బలోపేతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇబ్బందుల నివారణకు ప్లాట్ఫాం స్థాయి కమిటీలు పనిచేస్తాయి.
- కార్మికులను పనిలో నుంచి తొలగించినా లేదా పేమెంట్లు ఆపేసినా.. తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 'ప్లాట్ఫాం స్థాయి కమిటీలు' జిల్లా స్థాయి అధికారులతో కూడిన యంత్రాంగం ఉంటుంది.
- ఇంతకాలం యాప్ కంపెనీలు ఏ ప్రాతిపదికన ఆర్డర్లు ఇస్తున్నాయి, పేమెంట్లు ఎలా లెక్కిస్తున్నాయి అనే దానిపై స్పష్టత ఉండేది కాదు. ఇకపై యాప్ కంపెనీలు ఇష్టమొచ్చినట్లు రేట్లు తగ్గించడం, కార్మికులను ఇబ్బంది పెట్టడం కుదరదు. కార్మికులకు ఇచ్చే పేమెంట్లలో పారదర్శకత ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



