త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | ఇప్పుడు తెలంగాణలో నేనే నంబర్ 2.. టీపీసీసీ అధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Mahesh Kumar Goud | తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jan 7, 2026, 12.35 pm IST

Mahesh Kumar Goud | ఇప్పుడు తెలంగాణలో నేనే నంబర్ 2.. టీపీసీసీ అధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో నేనే నంబ‌ర్ 2 అని వ్యాఖ్యానించారు. త‌న‌కు మంత్రి పదవి అవసరం లేదు, ఇప్పటి వరకూ మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎవరినీ అడగలేదు అని ఆయ‌న పేర్కొన్నారు.

మంత్రి పదవి వస్తే... కేవలం ఒకే శాఖను చూడాల్సి ఉంటుంది, ఇప్పుడైతే అన్ని శాఖల గురించి తెలుసుకోవచ్చు అని మ‌హేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్న మహేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రి ప‌ద‌వి వ‌రించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు షికారు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌హేశ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వార్త‌ల‌కు తెర ప‌డింది.

Advertisement

తాజావార్తలు

Advertisement