త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T PCC Chief | కార్తీక దీపం అంటూ కేటీఆర్ రాగాలు : టీ పీసీసీ చీఫ్‌

T PCC Chief | త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ దీపం ఆగిపోకుండా ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాగాలు తీస్తున్నార‌ని టీ పీసీపీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు.

S

Telangana | Published On Jan 23, 2026, 5.30 pm IST

T PCC Chief | కార్తీక దీపం అంటూ కేటీఆర్ రాగాలు : టీ పీసీసీ చీఫ్‌
Advertisement

T PCC Chief | త్రినేత్ర‌.న్యూస్ : త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ దీపం ఆగిపోకుండా ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాగాలు తీస్తున్నార‌ని టీ పీసీపీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ విమ‌ర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. గాంధీ భ‌వ‌న్‌లో మ‌హేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యాంగం ప్ర‌కార‌మే విచార‌ణ జ‌రుపుతున్నాం. వ్యక్తిగత హననం చేస్తున్నారని కేటీఆర్ అనడం హాస్యాస్పదం. రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవి. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన‌ట్లే. కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. బట్ట కాల్చి మీద వేసి పారిపోతామంటే కుదరదు. అలీ బాబా 420 దొంగల మాదిరి కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్ప‌డింది అని టీ పీసీసీ చీఫ్ ధ్వ‌జ‌మెత్తారు.

దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై మాత్రమే ట్యాపింగ్ ప్ర‌యోగిస్తారు. నక్సలైట్లతో లావాదేవీలు జరుపుతున్నారని నాపై నిఘా పెట్టి ట్యాపింగ్ చేశారు. సినీ తారల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది.? తోడ బుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే సమాధానం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రమైంది. ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదు. అధికారులకు పరిమితులు ఉంటాయ‌ని మ‌హేశ్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement