త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vote For Notes Case Supreme Court | సుప్రీంకోర్టులో ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణ.. గంటన్నరపాటు సాగిన లూత్ర వాదనలు

సుప్రీంకోర్టులో 'ఓటుకు కోట్లు' కేసుకు సంబంధించి సుమారు గంటన్నరపాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు.

J

Telangana | Published On Sep 16, 2026, 3.45 pm IST

Vote For Notes Case Supreme Court | సుప్రీంకోర్టులో ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణ.. గంటన్నరపాటు సాగిన లూత్ర వాదనలు

సంక్షిప్త సారాంశం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర సుమారు గంటన్నరపాటు వాదనలు వినిపించారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదని, 2018 సవరణ చట్టం మాత్రమే దీనిని నేరంగా పరిగణించిందని వాదించారు. ఓటు వేయడం చట్టబద్ధమైన హక్కు అని, దీనిని ప్రభావితం చేస్తే అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి స్పష్టం చేశారు.

Advertisement

Vote For Notes Case Supreme Court | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసను విచారించింది. ఈ విచారణలో రేవంత్ రెడ్డి (ప్రస్తుత ముఖ్యమంత్రి) తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు.

న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు

కోర్టులో సుమారు గంటన్నరపాటు వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్ర పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 1988 నాటి అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act) ప్రకారం లంచం ఇవ్వడం నేరం కిందకు రాదని తెలిపారు. కేవలం 2018లో తెచ్చిన అవినీతి నిరోధక సవరణ చట్టంలో మాత్రమే లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ నేరంగా పరిగణించారని వాదించారు. 2015లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి 2018 నాటి సవరణ చట్టం వర్తించదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎఫ్‌ఐఆర్ (FIR), జనరల్ డైరీ ఎంట్రీ లేకుండానే ట్రాప్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

న్యాయస్థానం స్పందన

ఈ వాదనల సందర్భంగా ధర్మాసనంలోని జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి స్పందిస్తూ.. ఓటు వేయడం అనేది పౌరులకు లభించిన చట్టబద్ధమైన హక్కు అని, ఈ ప్రక్రియను ఎవరైనా ప్రభావితం చేస్తే మాత్రం అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.

Advertisement
Advertisement