త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Summer | మ‌ధ్యాహ్నం ఆ మూడు గంట‌లు ఇండ్ల‌ నుంచి బయటకు రావొద్దు.. ప్ర‌జ‌ల‌కు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చ‌రిక‌

Summer | రాష్ట్రంలో ఎండ‌లు (Summer) మండిపోతున్నాయి. ఉద‌యం 10 గంట‌ల నుంచే వేడి, ఉక్క‌పోత ప్రారంభ‌మ‌వుతున్నాయి. మ‌ధ్యాహ్నానికి బ‌య‌ట తిర‌గ‌లేని విధంగా సూర్యుడు ప్ర‌తాపం (Heat Wave) చూపిస్తున్నాడు.

G

Telangana | Published On Apr 10, 2026, 9.20 am IST

Summer | మ‌ధ్యాహ్నం ఆ మూడు గంట‌లు ఇండ్ల‌ నుంచి బయటకు రావొద్దు.. ప్ర‌జ‌ల‌కు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చ‌రిక‌
Advertisement

Summer | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు (Summer) మండిపోతున్నాయి. ఉద‌యం 10 గంట‌ల నుంచే వేడి, ఉక్క‌పోత ప్రారంభ‌మ‌వుతున్నాయి. మ‌ధ్యాహ్నానికి బ‌య‌ట తిర‌గ‌లేని విధంగా సూర్యుడు ప్ర‌తాపం (Heat Wave) చూపిస్తున్నాడు. ప‌లు జిల్లాలో 41 డిగ్రీల‌కుపైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత (Temperatures) పెరుగుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. 10 జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ నెల 14 వ‌ర‌కు ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని పేర్కొంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య సూర్యకాంతిలో బయటకు రావద్దని సూచించింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని తెలిపింది. బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని గదుల్లో ఉండాలని పేర్కొంది. మధ్యాహ్నం భారీ శ్రమతో కూడిన పనులు చేయొద్దని, కాలి నడకన చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదని తెలిపింది. అధిక వేడి సమయంలో వంట చేయకూడదని సూచించింది. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బనేటెడ్ డ్రింక్స్, ఎక్కువ చెక్కర ఉన్న పానీయాలు అస్సలు తీసుకోవ‌ద్ద‌ని, అధిక ప్రోటీన్, ఉప్పు, మసాలా, నూనె ఎక్కువ ఉండే ఆహారం తినకూడ‌ద‌ని హెచ్చ‌రించింది. నీరు బాగా తాగాలని, దాహం లేకపోయినా తరచుగా సరిపడ నీరు తాగాలని సూచించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement