త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case | పోక్సో కేసు పెట్టార‌ని.. భార్య‌, ఇద్ద‌రు పిల్లలు స‌హా ఆరుగురి దారుణ హత్య

POCSO Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌ల కేంద్రంలో దారుణం జ‌రిగింది. పోక్సో కేసు (POCSO Case) పెట్టార‌నే క‌క్ష‌తో త‌న భార్య పిల్ల‌లు స‌హా ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడో వ్య‌క్తి.

G

Telangana | Published On Jul 11, 2026, 6.29 am IST

POCSO Case | పోక్సో కేసు పెట్టార‌ని.. భార్య‌, ఇద్ద‌రు పిల్లలు స‌హా ఆరుగురి దారుణ హత్య
Advertisement

POCSO Case | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌ల కేంద్రంలో దారుణం జ‌రిగింది. పోక్సో కేసు (POCSO Case) పెట్టార‌నే క‌క్ష‌తో త‌న భార్య పిల్ల‌లు స‌హా ఆరుగురిని క‌త్తితో పొడిచి హత్య చేశాడో వ్య‌క్తి.

షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ (28) ఓ బాలిక‌ను వేధించాడని.. బాధితురాలు, ఆమె త‌ల్లి మే 16న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు పోక్సో కేసు న‌మోదుచేసి రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఇటీవ‌ల బెయిల్‌పై తిరొగిచ్చిన నిందితుడు.. శనివారం తెల్లవారుజామున త‌న భార్య సరిత, మూడేండ్ల కుమార్తె, రెండేండ్ల కుమారుడితోపాటు బాధిత బాలిక‌, ఆమె తల్లి, నానమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంత‌రం హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement