త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన‌ టీచ‌ర్.. తెగిపోయిన‌ విద్యార్థిని చెవి

Hyderabad | హైద‌రాబాద్ మెహిదీప‌ట్నంలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులు అల్ల‌రి చేస్తున్నార‌ని చెప్పి ఓ టీచ‌ర్ ప్యాడ్‌ను విసిరేసింది. దీంతో ఓ విద్యార్థిని చెవి తెగిపోయింది.

S

Hyderabad | Published On Jul 10, 2026, 10.00 pm IST

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన‌ టీచ‌ర్.. తెగిపోయిన‌ విద్యార్థిని చెవి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ మెహిదీప‌ట్నంలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులు అల్ల‌రి చేస్తున్నార‌ని చెప్పి ఓ టీచ‌ర్ ప్యాడ్‌ను విసిరేసింది. దీంతో ఓ విద్యార్థిని చెవి తెగిపోయింది. ఈ ఘ‌ట‌న గురువారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

ఆసిఫ్‌న‌గ‌ర్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌మోద్ కుమార్ రెడ్డి క‌థ‌నం మేర‌కు.. సెయింట్ ఆన్స్ పాఠ‌శాల‌లో ర‌జిని అనే మ‌హిళ టీచ‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తుంది. అయితే ఓ త‌ర‌గ‌తి గ‌దిలో ఆమె విద్యార్థినుల నోట్స్‌ను క‌రెక్ష‌న్ చేస్తుండ‌గా, కొంత మంది అమ్మాయిలు అల్ల‌రి చేశారు. అల్ల‌రిని అదుపు చేసేందుకు త‌న చేతిలో ఉన్న ఎగ్జామ్ ప్యాడ్‌ను విద్యార్థినుల‌పైకి విసిరేసింది. దీంతో ఓ అమ్మాయి చెవికి బ‌ల‌మైన గాయం త‌గిలింది. కొంత మేర చెవి తెగిపోయింద‌ని స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌మోద్ కుమార్ తెలిపారు.

అయితే బాధిత విద్యార్థిని వైద్య ఖ‌ర్చులు తామే భ‌రిస్తామ‌ని, ఈ ఘ‌ట‌న‌ను ఇక్క‌డితో ఆపేయండి స్కూల్ యాజ‌మాన్యం త‌న‌కు చెప్పింద‌ని ఆమె తండ్రి తెలిపాడు. త‌మ‌కు వైద్య ఖ‌ర్చులు అవ‌స‌రం లేద‌ని, ర‌జిని అనే టీచ‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు పేర్కొన్నాడు. ఈ పాఠ‌శాల‌లో విద్య బాగుంద‌ని తెలుసుకున్న త‌ర్వాత‌నే చేర్పించాన‌ని, టీచ‌ర్లు ఇలా ప్ర‌వ‌ర్తిస్తార‌ని ఊహించ‌లేద‌ని బాధితురాలి తండ్రి వాపోయాడు.

Advertisement
Advertisement