త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు

Phone Tapping Case | బీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాల‌యానికి రావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు.

S

Telangana | Published On Jan 26, 2026, 6.22 pm IST

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు
Advertisement

Phone Tapping Case | బీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌కు 160 సీఆర్పీసీ కింద‌ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాల‌యానికి రావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్ప‌టికే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావును సిట్ విచారించిన సంగ‌తి తెలిసిందే.

పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ నెల 23వ తేదీన సిట్ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంట‌ల పాటు కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు సిట్ అధికారులు. అంత‌కుముందు జ‌న‌వ‌రి 20న హ‌రీశ్‌రావును కూడా ఏడు గంట‌ల పాటు విచారించారు. మ‌ళ్లీ మూడు రోజుల విరామం అనంత‌రం తాజాగా పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సంతోష్ కుమార్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు.

ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం గ‌తేడాది డిసెంబ‌ర్ నెల‌లో కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌లో 9 మంది అధికారులు ఉన్నారు.

సిట్‌కు ఉన్న‌ నాలెడ్జ్ ఇదేనా..?

ఈ నోటీసుల జారీ నేప‌థ్యంలో సిట్‌కు ఉన్న నాలెడ్జ్ ఏంటో తేలిపోయింద‌ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విమ‌ర్శిస్తున్నారు. సంతోష్ కుమార్‌కు జారీ చేసిన నోటీసులు త‌ప్పులత‌డ‌క‌గా ఉంద‌ని పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం సంతోష్ కుమార్ కేవ‌లం పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ఎప్పుడో ముగిసింది. ఆ మాత్రం అవ‌గాహ‌న లేని సిట్ అధికారులు.. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యులుగా కొన‌సాగుతున్న‌ట్టు సిట్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఆయ‌న పేరును కూడా త‌ప్పుగా పేర్కొన్నారు. ఆయ‌న అస‌లు పేరు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ కాగా, నోటీసుల్లో మాత్రం జోగినిప‌ల్లి సంతోష్ రావు అని పేర్కొన‌డం సిట్ అధికారులకు ఉన్న అవ‌గాహ‌న రాహిత్యం బ‌య‌ట‌ప‌డింద‌ని బీఆర్ఎస్ నేత‌లు మండిప‌డ్డారు. ఆ నోటీసుల్లో ఉన్న అడ్ర‌స్ కూడా స‌రికాద‌ని, ఏ మాత్రం అవ‌గాహ‌న లేకుండా.. నోటీసులు జారీ చేస్తున్నార‌ని పార్టీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement