త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court | ప‌వ‌న్‌కు షాక్‌.. హౌస్ మోష‌న్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన హైకోర్టు

High Court | జ‌న‌సేనా పార్టీకి హైకోర్టులో షాక్ త‌గిలింది. హౌస్‌ మోషన్‌ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత పిటిష‌న్‌లో లేదంటూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

S

Telangana | Published On Jun 2, 2026, 2.00 pm IST

High Court | ప‌వ‌న్‌కు షాక్‌.. హౌస్ మోష‌న్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన హైకోర్టు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: జ‌న‌సేనా పార్టీకి హైకోర్టులో షాక్ త‌గిలింది. హైద‌రాబాద్‌లో న‌వ నిర్మాణ సభ నిర్వ‌హించేందుకు అనుమ‌తి ల‌భించ‌క‌పోవ‌డంతో జ‌నసేనా హైకోర్టును ఆశ్ర‌యించింది. సైబరాబాద్ పోలీసుల నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ అత్య‌వ‌స‌ర విచార‌ణ కోరుతూ హౌస్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అయితే ఈ పిటిష‌న్‌ను స్వీక‌రించేందుకు హైకోర్టు నిరాక‌రించింది. హౌస్‌ మోషన్‌ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత పిటిష‌న్‌లో లేదంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.

కేవియట్ పిటిషన్ దాఖ‌లు చేసిన పాశం యాద‌గిరి..

స‌భ‌కు అనుమ‌తివ్వ‌లేమ‌ని పోలీసులు సోమ‌వారమే జ‌న‌సేన‌కు స‌మాచార‌మిచ్చారు. దీంతో నేడు అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసి విచారణ జరపాలని జ‌న‌సేన కోరింది. ఈ వ్యవహారంలో ప్రముఖ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి కేవియెట్‌ పిటిష‌న్‌ దాఖలు చేసి తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరు పక్షాల అంశాలను పరిశీలించిన కోర్టు.. జనసేన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో నవనిర్మాణ పేరిట సభ నిర్వహణకు జనసేన ప్రయత్నించింది. అయితే తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యలు, ఇక్కడి రాజకీయ నేతల ఖండన, తాజా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక‌ ఇప్పుడు సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ నిర్వహించబోయే ప్రెస్‌మీట్ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ మొద‌లైంది.

Advertisement
Advertisement