త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SEC | మున్సిప‌ల్ ప్రాంతంలో ఓట‌ర్‌గా రిజిస్ట‌ర్ అయితేనే.. ఎక్స్ అఫీషియో స‌భ్యులకు ఓటు: ఎస్ఈసీ

SEC | త్రినేత్ర‌.న్యూస్‌: మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే ఎక్స్ అఫీషియో స‌భ్యులకు ఓటు (Ex-oficio vote) వేసే అర్హత ఉంటుందని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం (SEC) స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.

G

Telangana | Published On Feb 14, 2026, 10.18 am IST

SEC | మున్సిప‌ల్ ప్రాంతంలో ఓట‌ర్‌గా రిజిస్ట‌ర్ అయితేనే.. ఎక్స్ అఫీషియో స‌భ్యులకు ఓటు: ఎస్ఈసీ
Advertisement

SEC | త్రినేత్ర‌.న్యూస్‌: మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే ఎక్స్ అఫీషియో స‌భ్యులకు ఓటు (Ex-oficio vote) వేసే అర్హత ఉంటుందని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం (SEC) స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. సుమారు 40 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌ప‌ర్సన్ ఎన్నికలపై ఎస్ఈసీ స్పష్టత ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేర‌కు ఎక్స్ అఫీషియో స‌భ్యుల అర్హ‌త‌ల‌పై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది.

మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. నిబంధనల ప్రకారం అర్హత లేని వారు వేసిన ఓటు చెల్లద‌ని, అలాంటి వారిని సభ్యుడిగా పరిగణించర‌ని పేర్కొంది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 ప్రకారం పక్కాగా నిబంధనల అమలు చేయాల‌ని లెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను సర్క్యులర్ జారీ చేసింది.

కొత్త‌గా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈనెల 16న‌ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ల‌ను ఎన్నుకోనున్నారు. ఈనేప‌థ్యంలో చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement