త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Savitribai Phule | మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వంగా సావిత్రి బాయి ఫూలే జ‌యంతి

Savitribai Phule | ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి ఫూలే 195వ జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

S

Telangana | Published On Jan 2, 2026, 1.08 pm IST

Savitribai Phule | మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వంగా సావిత్రి బాయి ఫూలే జ‌యంతి
Advertisement

Savitribai Phule | త్రినేత్ర‌.న్యూస్ : ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి ఫూలే 195వ జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సావిత్ర బాయి ఫూలే జ‌యంతిని మ‌హిళా ఉపాధ్యాయుల దినోత్స‌వంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మహిళా విద్యకు సావిత్రి బాయి ఫూలే చేసిన సేవకు గౌరవ సూచకంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

ఈ నెల 3వ తేదీన సావిత్రి బాయి ఫూలే జ‌యంతి సంద‌ర్భంగా అన్ని జిల్లాల్లో మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌తి జిల్లాల్లో 10 మంది ఉత్త‌మ మ‌హిళా టీచ‌ర్ల‌ను ఎంపిక చేసి, వారిని స‌న్మానించాల‌ని ఆదేశించింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు బీసీ కులానికి చెందిన ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించాల‌ని సూచించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement