త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | జ‌నం ఆకాంక్ష‌లే కేంద్రంగా.. త్యాగాల ఆశ‌యాలే ఇంధ‌నంగా.. వెయ్యిరోజుల పాల‌న‌: సీఎం రేవంత్‌

Revanth Reddy | జనం ఆకాంక్షలే కేంద్రంగా, త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ (Congress Govt) కొలువుదీరి 1000 రోజులు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు చేశారు.

G

Telangana | Published On Sep 2, 2026, 12.43 pm IST

Revanth Reddy | జ‌నం ఆకాంక్ష‌లే కేంద్రంగా.. త్యాగాల ఆశ‌యాలే ఇంధ‌నంగా.. వెయ్యిరోజుల పాల‌న‌: సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: జనం ఆకాంక్షలే కేంద్రంగా, త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ (Congress Govt) కొలువుదీరి 1000 రోజులు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు చేశారు. పేదల అవసరాలను, వారి ఆత్మగౌరవాలను మేళవించి సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర దీర్ఘకాలిక భవితను, బిడ్డల ఉపాధిని మేళవించి అభివృద్ధి ప‌థంలో న‌డుస్తున్నామ‌ని పేర్కొన్నారు.

సకల వర్గాలకు సామాజిక న్యాయాన్ని, సమాన అవకాశాలను క‌ల్పిస్తూ వెయ్యి రోజుల పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులు, ల‌క్షలాది కాంగ్రెస్ కార్యకర్తల అండతో తెలంగాణను (Telangana) విశ్వ వేదిక‌పై విజయపతాకగా నిలిపే వరకు ఈ కృషిని అవిశ్రాంతంగా కొనసాగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రయాణంలో త‌న‌కు తోడుగా, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీతో ఈ అనుబంధం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

Advertisement
Advertisement