త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PDS Ration | మూడు నెల‌ల రేష‌న్ బియ్యం.. ఈ నెల 5 వరకు పంపిణీ

PDS Ration | ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల కోటా రేష‌న్ బియ్యం (PDS Ration) ఒకే సారి ప‌పిణీ చేస్తున్న‌విష‌యం తెలిసిందే. ఆగ‌స్టులో రేష‌న్ దుకాణాల (Ration Shops) వ‌ద్ద ర‌ద్దీతోపాటు రాఖీ పండుగ నేప‌థ్యంలో చాలా మంది రేష‌న్ తీసుకోలేక పోయారు.

G

Telangana | Published On Sep 2, 2026, 8.51 am IST

PDS Ration | మూడు నెల‌ల రేష‌న్ బియ్యం.. ఈ నెల 5 వరకు పంపిణీ
Advertisement

PDS Ration | త్రినేత్ర‌.న్యూస్‌: ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల కోటా రేష‌న్ బియ్యం (PDS Ration) ఒకే సారి ప‌పిణీ చేస్తున్న‌విష‌యం తెలిసిందే. ఆగ‌స్టులో రేష‌న్ దుకాణాల (Ration Shops) వ‌ద్ద ర‌ద్దీతోపాటు రాఖీ పండుగ నేప‌థ్యంలో చాలా మంది రేష‌న్ తీసుకోలేక పోయారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం పంపిణీ గడువును పొడిగించింది. సెప్టెంబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు పీడీఎస్ బియ్యాన్ని పంపిణీ చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ల‌బ్దిదారులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

గ‌త ఎండా కాలంలో ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల బియ్యాన్ని ప్ర‌భుత్వం ఒకేసారి పంపిణీ చేసింది. ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో మూడు నెల‌ల బియ్యాన్ని ఒకేసారి ఇచ్చింది. జూలైలో ఒక నెల బియ్యం ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఎల్ నినో ప్ర‌భావంతో రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల కోటా బియ్యాన్ని కూడా ఒకేసారి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఆగ‌స్టు నెల మొత్తం రేష‌న్ దుకాణాలు తెరిచే ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల బియ్యం స్టాక్ లేక‌పోవ‌డంతోపాటు జ‌నం ఎక్కువ సంఖ్య‌లో ఉండ‌టంతో ల‌బ్ధిదారులు బియ్యం తీసుకోలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో పంపిణీ గ‌డువును పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement