త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Patnam Mahender Reddy | రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం: ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి

Patnam Mahender Reddy | ముఖ్య‌మంత్రి (CM) గా ఎవ‌రు ఉన్నా రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లోని భూముల‌ను అమ్ముతున్నార‌ని, కానీ జిల్లా అభివృద్ధికి నిధులు అందించ‌కుండా తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ డాక్ట‌ర్ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ఆరోపించారు.

A

Telangana | Published On Jan 6, 2026, 5.40 pm IST

Patnam Mahender Reddy | రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం: ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి
Advertisement

భూములు అమ్ముతున్నా జిల్లాకు నిధుల కేటాయింపులో వివ‌క్ష‌
ప్ర‌జ‌ల‌కు స‌మాధాన‌మివ్వ‌లేక‌పోతున్నాం
ఇలాగే కొన‌సాగితే ఉద్య‌మం త‌ప్ప‌దు

Patnam Mahender Reddy | ముఖ్య‌మంత్రి (CM) గా ఎవ‌రు ఉన్నా రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లోని భూముల‌ను అమ్ముతున్నార‌ని, కానీ జిల్లా అభివృద్ధికి నిధులు అందించ‌కుండా తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ డాక్ట‌ర్ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ఆరోపించారు. శాస‌న‌మండ‌లిలో మంగ‌ళ‌వారం ప్ర‌సంగించిన మ‌హేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ య‌థేచ్ఛ‌గా భూములు అమ్ముతున్న నిధుల కేటాయింపులో జిల్లాపై వివ‌క్ష చూపుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై జిల్లా వాసులు ప్ర‌శ్నిస్తే స‌మాధానం చెప్పుకోలేక‌పోతున్నామ‌ని వాపోయారు. ఇది ఇలాగే కొన‌సాగితే ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తార‌ని హెచ్చ‌రించారు. విక్ర‌యించిన భూమి విలువ‌లో 30 శాతం నిధుల‌ను జిల్లా అభివృద్ధికి కేటాయించాల‌ని డిమాండ్ చేశారు.

నాడు ఎన్టీ రామారావు మొదలు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఇలా ముఖ్యమంత్రి ఎవరైనా రంగారెడ్డి జిల్లాలోని చాలా భూములను అమ్మార‌ని గుర్తు చేశారు. వ‌చ్చిన వేలాది కోట్లను సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచేందుకు వినియోగించారని చెప్పారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం, ప్రభుత్వాన్ని నిర్వహించడం కోసం రంగారెడ్డి జిల్లా భూములను అమ్మినప్ప‌టికీ, జిల్లాకు మాత్రం అందవలసిన స్థాయిలో నిధులు అందలేదని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తనను, తమలాంటి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విలువైన రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముకుంటున్నందున జిల్లా అభివృద్ధికి 30 శాతం నిధుల‌ను జిల్లా అభివృద్ధికి వినియోగించేలా చూడాలని కోరారు. లేనిప‌క్షంలో భవిష్యత్తులో జిల్లాలో ప్రజలు తిరగబడి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసే ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని తెలిపారు. కనీసం ఈ ప్రభుత్వమైనా రంగారెడ్డి జిల్లాలో అమ్ముతున్న భూముల ద్వారా వచ్చిన డబ్బులలో జిల్లా అభివృద్ధి కోసం కనీసం 40% కేటాయించాలని ప్ర‌భుత్వాన్ని కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement