త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pregnant Woman | క‌డుపులోని బిడ్డ‌కు డీఎన్ఏ టెస్ట్‌.. భ‌ర్త‌, అత్త వేధింపుల‌తో గ‌ర్భిణి ఆత్మ‌హ‌త్య‌

Pregnant Woman | మెద‌క్ జిల్లా అల్లాదుర్గం (Alladurg) మండ‌లం గ‌డిపెద్దాపూర్‌లో దారుణం చోటుచేసుకున్న‌ది. క‌డుపులోని బిడ్డ‌కు డీఎన్ఏ (DNA) టెస్టు చేయించాలంటూ అత్తింటివారు వేధిస్తుండ‌టంతో ఐదు నెల‌ల గ‌ర్భిణి (Pregnant Woman) ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది.

G

Telangana | Published On Jun 27, 2026, 12.04 pm IST

Pregnant Woman | క‌డుపులోని బిడ్డ‌కు డీఎన్ఏ టెస్ట్‌.. భ‌ర్త‌, అత్త వేధింపుల‌తో గ‌ర్భిణి ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Pregnant Woman | త్రినేత్ర‌.న్యూస్‌: మెద‌క్ జిల్లా అల్లాదుర్గం (Alladurg) మండ‌లం గ‌డిపెద్దాపూర్‌లో దారుణం చోటుచేసుకున్న‌ది. క‌డుపులోని బిడ్డ‌కు డీఎన్ఏ (DNA) టెస్టు చేయించాలంటూ అత్తింటివారు వేధిస్తుండ‌టంతో ఐదు నెల‌ల గ‌ర్భిణి (Pregnant Woman) ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది.

వికారాబాద్ జిల్లా కోట‌ప‌ల్లి మండ‌లం మొత్తుక‌ప‌ల్లికి చెందిన సుష్మిత (23)కు గ‌డిపెద్దాపూర్‌కు చెందిన గాజుల అభిలాష్‌తో ఏడాదిన్న‌ర క్రితం వివాహం అయింది. ప్ర‌స్తుతం సుష్మిత ఐదు నెల‌ల గ‌ర్భిణి. అయితే ఆమెపై అనుమానం పెంచుకున్న భ‌ర్త‌.. త‌న త‌ల్లి శ‌శిరేఖ‌తో క‌లిసి వేధిస్తున్నాడు. గ‌ర్భంలోని శిశువుకు డీఎన్ఏ ప‌రీక్ష (DNA Test) చేయించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో త‌ర‌చూ కుటుంబంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో తీవ్ర‌ మ‌న‌స్తాపానికి గురైన సుష్మిత ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

అయితే మృతురాలి త‌ల్లి జానాబాయి త‌న కుమార్తెను భ‌ర్త అభిలాష్‌, అత్త శ‌శిరేఖ‌లే హ‌త్య చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాన్ని సంగారెడ్డి ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

 

Advertisement
Advertisement