Yadadri MMTS | యాదాద్రికి ఎంఎంటీఎస్.. ఏప్రిల్లో శంకుస్థాపన చేయనున్న మోదీ..!
Yadadri MMTS | ఎన్నో ఏళ్ల కల ఫలించనుంది. యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. రెండున్నరేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి యాదాద్రి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికార యంత్రాంగం సంకల్పించింది.
Yadadri MMTS | త్రినేత్ర.న్యూస్ : ఎన్నో ఏళ్ల కల ఫలించనుంది. యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. రెండున్నరేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి యాదాద్రి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికార యంత్రాంగం సంకల్పించింది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని స్థానిక రైల్వే అధికారులు పేర్కొన్నారు. శంకుస్థాపన అయితే ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందని తెలిపారు.
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉన్న ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే చేపడుతోంది. మూడేండ్లలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కాంట్రాక్టును ఇటీవల రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL)కు అప్పగించగా, రాయగిరి వరకు భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ ప్రాజెక్టును తొలుత 2016-17లో రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా మంజూరు చేశారు. ఆ తర్వాత, కేంద్ర ప్రభుత్వం దశలవారీగా మంజూరు చేసిన నిధులతో ఈ ప్రాజెక్టును స్వతంత్రంగా చేపట్టాలని రైల్వే సంస్థ నిర్ణయించింది.
సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా రాయగిరి వరకు ప్రతిపాదిత 33 కిలోమీటర్ల మార్గాన్ని సుమారు రూ. 430 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, అవసరమైన విభాగాలలో ట్రాక్ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త స్టేషన్ల నిర్మాణం, ప్రస్తుత మౌలిక సదుపాయాల ఆధునీకరణ వంటి పనులు చేపట్టనున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



