త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | తెలంగాణ‌లో క్రిటికల్ మినరల్స్‌పై పరిశోధన

Telangana | మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి కాలరీస్ సంస్థల ప్రతినిధులతో క్రిటికల్ మినరల్స్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స‌మావేశం నిర్వ‌హించారు.

S

Telangana | Published On Sep 1, 2026, 10.35 pm IST

Telangana | తెలంగాణ‌లో క్రిటికల్ మినరల్స్‌పై పరిశోధన
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి కాలరీస్ సంస్థల ప్రతినిధులతో క్రిటికల్ మినరల్స్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స‌మావేశం నిర్వ‌హించారు. క్రిటికల్ మినరల్స్ పరిశోధన, ఖనిజ అన్వేషణ, అధునాతన వెలికితీత–శుద్ధి సాంకేతికతల అభివృద్ధికి ఈ త్రిముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ కేవలం క్రిటికల్ మినరల్స్ వినియోగదారుగా కాకుండా, పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి ద్వారా మొత్తం విలువ శృంఖలిలో కీలక భాగస్వామిగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఐఐటీ హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బలోపేతం చేసి, వాణిజ్య స్థాయిలో ఉపయోగపడే సాంకేతికతల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అవసరమైన కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది.

Advertisement
Advertisement