Landmine | కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర.. ఆవులు మేపేందుకు వెళ్లి వ్యక్తి మృతి
Landmine | ములుగు (Mulugu) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కర్రెగుట్టల అడవుల్లో (Karreguttalu Forest) మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న మందుపాతర (Landmine) పేలింది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
Landmine | త్రినేత్ర.న్యూస్: ములుగు (Mulugu) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కర్రెగుట్టల అడవుల్లో (Karreguttalu Forest) మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న మందుపాతర (Landmine) పేలింది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మావోయిస్టులు ఉనికిలేనప్పుడు మందుపాతర పేలడు కలకలం సృష్టించింది. ఇప్పటికే కర్రెగుట్టలను మావోయిస్టు రహిత ప్రాంతంగా పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
బుధవారం సాయంత్రం వెంకటాపురం మండలం నూగురు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు (55) ఆవులు మేపేందుకు కర్రెగుట్ట అడవి ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ అడవిలో అమర్చిన మందుపాతరపై అడుగుపెట్టడంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పేలుడుకు సంబంధించిన సమాచారం అందుకున్న గ్రామస్తులు కాలినడకన అడవిలోకి వెళ్లి నాగేశ్వరరావు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు (Maoists) కేంద్రంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఎలక్ట్రిక్ వైర్లు, మందుపాతరలు కనిపిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
- ●ACB Raids | సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు
- ●Sircilla | అనుమానంతో భార్యను చంపిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా..
- ●SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్
- ●Hindu Temple Demolition | పాక్లో మదర్సా కోసం వందేండ్లనాటి గుడి కూల్చివేత.. ఖండించిన భారత్
- ●పిలుపులేమో స్వదేశీ... దిగుమతులేమో విదేశీ: ఎన్నాళ్ళీ రూపాయి కుంగుబాటు?
- ●Horoscope | సెప్టెంబర్ 3 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనవసరమైన ఆందోళనలు!

ACB Raids | సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు

Sircilla | అనుమానంతో భార్యను చంపిన భర్త.. అడ్డొచ్చిన అత్తను కూడా..

SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్

Hindu Temple Demolition | పాక్లో మదర్సా కోసం వందేండ్లనాటి గుడి కూల్చివేత.. ఖండించిన భారత్






