Gollala Gudi | ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు
Gollala Gudi | ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది.
భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్ఐ) అధికారిక పత్రికా ప్రకటన
Gollala Gudi | త్రినేత్ర.న్యూస్ : ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్ఐ) జారీ చేసిన ‘గెజిట్ ఆఫ్ ఇండియా’ లో ప్రచురితమైంది.
గొల్లల గుడి ఎక్కడ ఉందంటే..?

ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా కనిపిస్తుంది. దీని ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది.

అందంగా ఉప ఆలయాలు.. మూడు గర్భాలయాలు
ఈ ప్రధాన గుడికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది.
సంబంధిత వార్తలు

Konda Surekha | సీఎం రేవంత్ పైనే చర్యలు తీసుకోండి : మంత్రి కొండా సురేఖ
సెప్టెంబర్ 2, 2026

MLC Ravinder Rao | వీసా రూల్స్ లో తెలంగాణ ఎన్ఆర్ఐలకు సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్ రావు
సెప్టెంబర్ 2, 2026

Revanth Reddy | జనం ఆకాంక్షలే కేంద్రంగా.. త్యాగాల ఆశయాలే ఇంధనంగా.. వెయ్యిరోజుల పాలన: సీఎం రేవంత్
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Konda Surekha | సీఎం రేవంత్ పైనే చర్యలు తీసుకోండి : మంత్రి కొండా సురేఖ
- ●KPHB Open Plots Auction | కేపీహెచ్బీలో హాట్ కేకుల్లా ఓపెన్ ప్లాట్లు.. గజం ఏకంగా రూ.2.70 లక్షలు
- ●Jitendra Mishra | అయోధ్య ట్రస్ట్ సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
- ●Jio Hotstar | జియోహాట్స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం
- ●డిఫెన్స్ నుంచి అటాక్లోకి సురేఖ.. రివర్స్ గేమ్తో హైకమాండ్కు బిగ్ సర్ప్రైజ్!
- ●Maternity leave | ప్రసూతి సెలవు కారణంగా మహిళ హోదా తగ్గించకూడదు.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు

Konda Surekha | సీఎం రేవంత్ పైనే చర్యలు తీసుకోండి : మంత్రి కొండా సురేఖ

KPHB Open Plots Auction | కేపీహెచ్బీలో హాట్ కేకుల్లా ఓపెన్ ప్లాట్లు.. గజం ఏకంగా రూ.2.70 లక్షలు

Jitendra Mishra | అయోధ్య ట్రస్ట్ సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

Jio Hotstar | జియోహాట్స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం



