Godavari Floods | గోదావరి వరద బాధితులకు అండగా ప్రభుత్వం
Godavari Floods | గోదావరి వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. మంగపేట మండలంలో గోదావరి వరద పరిస్థితులను శనివారం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కాకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి పరిశీలించారు.
- ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం
- మంగపేట పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క
Godavari Floods | గోదావరి వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. మంగపేట మండలంలో గోదావరి వరద పరిస్థితులను శనివారం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కాకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. బ్యాక్వాటర్ ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి 28 కుటుంబాలకు చెందిన 112 మందిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్కడ కల్పించిన ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించి బాధితుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని, నది పరివాహక ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రతి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య సౌకర్యాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రతి సౌకర్యం బాధితులకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన గృహాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి దశలో ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అంతకుముందు మంగపేట వద్ద గోదావరి బ్యారేజీ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్ తోట రవీందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Keerthy Suresh | కీర్తి సురేష్ తగ్గేదేలే - రెండు రోజుల సాంగ్ కోసం అన్ని కోట్లు డిమాండ్ చేసిందా?
- ●E20 fuel | E20 లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది : కేంద్రం
- ●Eravathri Anil | సీఎం అవ్వాలంటే పోటీ పరీక్షలు రాయాలా?.. సంస్కరణలు తెస్తుంటే విమర్శలెందుకు?
- ●Minister Tummala | వ్యవసాయ మార్కెట్లకు డిజిటల్ హంగులు
- ●TSLPRB | తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు.. ఫీజు ఎంతంటే..?
- ●TISS | కాక్రోచ్ల భయం.. సీజేఐ పాల్గొనాల్సిన స్నాతకోత్సవాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసిన టిస్

Keerthy Suresh | కీర్తి సురేష్ తగ్గేదేలే - రెండు రోజుల సాంగ్ కోసం అన్ని కోట్లు డిమాండ్ చేసిందా?

E20 fuel | E20 లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది : కేంద్రం

Eravathri Anil | సీఎం అవ్వాలంటే పోటీ పరీక్షలు రాయాలా?.. సంస్కరణలు తెస్తుంటే విమర్శలెందుకు?

Minister Tummala | వ్యవసాయ మార్కెట్లకు డిజిటల్ హంగులు





