త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhuvanagiri | భువ‌న‌గిరిలో దారుణం.. పిల్ల‌ల‌పై క‌త్తితో దాడిచేసిన త‌ల్లి

huvanagiri | యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) మండలం తొక్కాపురంలో దారుణం చోటుచేసుకున్న‌ది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసింది.

G

Telangana | Published On Mar 15, 2026, 9.07 am IST

Bhuvanagiri | భువ‌న‌గిరిలో దారుణం.. పిల్ల‌ల‌పై క‌త్తితో దాడిచేసిన త‌ల్లి
Advertisement

Bhuvanagiri | త్రినేత్ర‌.న్యూస్‌: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) మండలం తొక్కాపురంలో దారుణం చోటుచేసుకున్న‌ది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసింది. అనంత‌రం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కూతురు మృతిచెంద‌గా, కొడుకు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డితో నీలిమ (40)కు 15 ఏండ్ల‌ క్రితం వివాహ‌మైంది. వారికి కూతురు కృతిక రెడ్డి (14), కుమారుడు అక్షిత్ రెడ్డి (11) ఉన్నారు. కొంతకాలంగా నీలిమ మానసిక స్థితి (మతిస్థిమితం) సరిగ్గా లేదని తెలుస్తున్న‌ది. కాగా, శనివారం సాయంత్రం పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లిదండ్రుల ఇంటికి వ‌చ్చిన నీలిమ‌.. రాత్రి పిల్లలిద్దరూ నిద్రిస్తున్న సమయంలో వారిపై కత్తితో వారిపై దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన కృతిక అక్కడికక్కడే మృతిచెందింది. గదిలో నుంచి బయటకు పరిగెత్తడంతో అక్షిత్ దాడినుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అనంత‌రం నీలిమ ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.

గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను ర‌క్షించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ద‌వాఖాన‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉంటంతో ఉప్ప‌ల్‌లోని ఓ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దాడికి కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని తెలుస్తున్న‌ది.

Advertisement
Advertisement