త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Kavitha | ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మ గౌర‌వ పంచాయితీ: ఎమ్మెల్సీ క‌విత

MLC Kavitha | హైద‌రాబాద్‌: మా ఇంటి దైవం ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామిపై, నా ఇద్ద‌రు కొడుకుల‌పై ప్ర‌మాణం చేసి చెబుతున్నా, మాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మ గౌర‌వ పంచాయితీ అని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు.

S

Telangana | Published On Jan 5, 2026, 12.54 pm IST

MLC Kavitha | ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మ గౌర‌వ పంచాయితీ: ఎమ్మెల్సీ క‌విత
Advertisement

MLC Kavitha | హైద‌రాబాద్‌: మా ఇంటి దైవం ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామిపై, నా ఇద్ద‌రు కొడుకుల‌పై ప్ర‌మాణం చేసి చెబుతున్నా, మాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మ గౌర‌వ పంచాయితీ అని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. ప‌లు అంశాల‌పై మాట్లాడిన ఆమె కంట త‌డి పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీ మార్చేందుకు తాను ఒప్పుకోలేద‌ని తెలిపారు. కేసీఆర్‌పై క‌క్ష‌తో బీజేపీ త‌న‌ను జైల్లో పెట్టింద‌ని, 8 ఏళ్లుగా ప్ర‌జ‌ల కోసం తాను చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని అడ్డుకున్నార‌ని అన్నారు. ఈడీ, సీబీఐల‌పై తాను పోరాడినా బీఆర్ఎస్ త‌న‌కు అండ‌గా నిల‌వ‌లేద‌న్నారు. కక్ష గట్టి త‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారని విచారం వ్య‌క్తం చేశారు.

ఉద్య‌మ‌కారులు, సూటిగా ప్ర‌శ్నించే వారి ప‌ట్ల వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని క‌విత అన్నారు. బోధ‌న్ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ తేక‌పోవ‌డం విచార‌క‌రమ‌ని, పార్టీ మౌత్ పీస్‌గా ఉన్న పేప‌ర్లు, చాన‌ళ్లు త‌న‌కు ఏనాడూ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని అన్నారు. కేసీఆర్‌కు అవినీతి మ‌ర‌క అంటితే తాను పోరాడాన‌ని, ఇసుక దందాల‌తో నేరెళ్ల‌లాంటి ఘ‌ట‌న‌ల్లో ద‌ళితులు బాధితులుగా మారార‌ని అన్నారు. అందుక‌నే పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి.. అని గ‌ట్టిగా మాట్లాడాన‌ని, త‌న‌ బ‌హిష్క‌ర‌ణ ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా జ‌ర‌గ‌లేదని అన్నారు. త‌న‌ స‌స్పెన్ష‌న్‌కు ముందు త‌న‌ను వివ‌ర‌ణ కోర‌లేద‌ని, నైతిక‌త లేని బీఆర్ఎస్ నుంచి దూర‌మైనందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. సిరిసిల్ల క‌లెక్ట‌రేట్ నుంచి స‌చివాల‌య నిర్మాణం వ‌ర‌కు ప్ర‌తి దాంట్లో అవినీతి చోటు చేసుకుంద‌ని వివరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement