త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singireddy Niranjan Reddy | నెహ్రూ కాలం నుంచే తెలంగాణకు అన్యాయం.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం

Singireddy Niranjan Reddy | నెహ్రూ హ‌యాం నుంచి తెలంగాణ‌కు అన్యాయం చేయ‌డం మొద‌లైంద‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ స‌ర్కార్ హ‌యాంలోనే పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు 90శాతం పూర్త‌య్యాయ‌ని.. ఆ ప‌నులు ఆప‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు.

P

Telangana | Published On Jan 6, 2026, 5.14 pm IST

Singireddy Niranjan Reddy | నెహ్రూ కాలం నుంచే తెలంగాణకు అన్యాయం.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం
Advertisement

Singireddy Niranjan Reddy | నెహ్రూ హ‌యాం నుంచి తెలంగాణ‌కు అన్యాయం చేయ‌డం మొద‌లైంద‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ స‌ర్కార్ హ‌యాంలోనే పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు 90శాతం పూర్త‌య్యాయ‌ని.. ఆ ప‌నులు ఆప‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మంగ‌ళ‌వారం సంద‌ర్శించింది. నార్లపూర్ పంప్‌హౌస్‌, రిజర్వాయర్, వట్టెం పంప్‌హౌస్‌, కరివెన రిజర్వాయర్లను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నిరంజ‌న్‌రెడ్డి మాట్లాడుతూ జూరాల నుంచి పాల‌మూరుకు నీళ్లంటేనే పెద్ద కుట్ర అంటూ ధ్వ‌జ‌మెత్తారు. మంత్రి ఉత్త‌మ్ పీపీటీ అంతా త‌ప్పుల త‌డ‌క‌ని, హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ ఫుల్ ప్ర‌జంటేష‌న్‌తో ఉత్త‌మ్‌కు స‌మాధానం ఇచ్చార‌న్నారు.

తెలుగు గంగ పేరుతో నీటి త‌ర‌లింపు..

అన్ని అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న ఉంద‌ని, కృష్టా నీళ్లు తెలంగాణ‌కు ద‌క్కకుండా చేసే కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. నిజాం కాలంలోనే కృష్ణా నీటి కోసం అనేక ప్రాజెక్టుల‌ను రూప‌క‌ల్ప‌న చేశార‌ని, తుంగ‌భ‌ద్ర‌లో నీటి పంప‌కాల‌పై 65 టీఎంసీల కోసం 1944లో ఒప్పందాలు జ‌రిగాయ‌న్నారు. మొద‌ట భీమా ప్రాజెక్టును ప్ర‌తిపాదించార‌ని.. ఆల‌మ‌ట్టిని సైతం నిజాం కాలంలోనే ప్ర‌తిపాదించార‌న్నారు. పాల‌మూరుకు 174 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిజాం ప్రాజెక్టులను నిర్మించార‌ని నిరంజ‌న్‌రెడ్డి తెలిపారు. నిజాం ప్ర‌తిపాద‌న‌ల‌ను నెహ్రూ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన విష‌యాన్ని గుర్తు చేసిన ఆయ‌న‌.. ఆ స‌మ‌యం నుంచే తెలంగాణ‌కు అన్యాయం చేయ‌డం మొద‌లైంద‌న్నారు. సిద్దేశ్వ‌రం వ‌ద్ద నిర్మించాల్సిన శ్రీ‌శైలం ప్రాజెక్ట్‌ని 86 కిలోమీట‌ర్ల దిగువ‌న క‌ట్టార‌ని, సిద్దేశ్వ‌రం వ‌ద్దే నిర్మిస్తే గ్రావిటి ద్వారా పాల‌మూరుకు నీరు వ‌చ్చేవ‌ని గుర్తు చేశారు. శ్రీశైలం జ‌లాశ‌యం నుంచి తెలుగుగంగ పేరిట నీటిని త‌ర‌లించార‌ని.. కడప, నెల్లూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని ఆరోపించారు. కృష్ణా నదిని మొత్తం మలుపుకు పోయేలా పోతిరెడ్డిపాడును చేపట్టారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా చేసే కుట్ర అప్పుడు జరిగిందని, ఇప్పుడు అదే జ‌రుగుతుంద‌న్నారు.

10శాతం ప‌నులు పూర్తి చేస్తే నీటిని వాడుకోవ‌చ్చు..

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప‌థ‌కం ప‌నుల‌ను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ప‌దిశాతం ప‌నులు పూర్తి చేస్తే.. నీటిని వాడుకోవ‌చ్చ‌ని చెప్పారు. కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి మొద‌ల‌వుతుంద‌ని నిల‌దీశారు. రూ.32వేల కోట్ల ప‌నుల‌ను బీఆర్ఎస్ పూర్తి చేసుకోవ‌చ్చ‌ని, రూ.27వేల కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు. కేసీఆర్ వచ్చాక తెలంగాణ నీటి లభ్యత గురించి తెలిపార‌ని, ముందే అప్రమత్తమైతే తెలంగాణ నీటి వాటాను కోల్పోయేది కాద‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement