Municipal Elections | ప్రజాస్వామ్య పండుగా? అధికార పార్టీ కుట్రా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Municipal Elections | మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగా? అధికార పార్టీ కుట్రా? అంటూ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్పై ఆయన బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు.
Municipal Elections | మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగా? అధికార పార్టీ కుట్రా? అంటూ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్పై ఆయన బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర ఎన్నికల సంఘం అవమాన పరిచిందని ఆరోపించారు. షెడ్యూల్ను చూస్తుంటే అసలు ఇది ఎన్నికలా? లేక ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి వేసిన రాజకీయ ఉచ్చా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఓటర్ల జాబితా సరి చూసుకునేందుకు కేవలం ఒక రోజు, నామినేషన్లు వేసేందుకు రెండురోజులు, ప్రచారం కోసం కనీసం వారం రోజులు సమయం ఇవ్వకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. షెడ్యూల్ ప్రకటన తేదీకి, నోటిఫికేషన్ జారీ చేసిన తేదీకి ఒక రోజు వ్యవధి ఇవ్వకపోవడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారన్నారు. ఈ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర జరుగుతోందని, దాదాపు ప్రతి ఇంటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతరకు వెళ్తారన్నారన్నారు.
ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా..
జాతరలోనే ఒకటి రెండు రోజులుండి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. కావాలనే ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఈసీ ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మలా మారి నియంతృత్వంగా ఎన్నికల నిర్వహణకు పాల్పడడం ప్రజల విశ్వాసాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆరోపించారు. ఎన్నికలంటే ఈసీ ఆఫీసులో క్లర్కుల తరహాలో ఫైల్స్ క్లియర్ చేసినట్లు కాదని.. మన ప్రజాస్వామ్యానికి పునాదులన్న విషయాన్ని ఈసీ మరువడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదని.. పాలన ఆగిపోలేదని.. ఇంత ఊపిరాడనికి హడావుడి ఎందుకు అంటూ ఎమ్మెల్సీ నిలదీశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య ఎన్నికలంటేనే ఏదో ఒక పెద్ద తలనొప్పి అన్నట్టు, దాన్ని ఎలాగోలా 'సామ దాన భేద దండోపాయాలతో' త్వరగా చుట్టేయాలనే ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అతి తక్కువ గడువు ఉన్న షెడ్యూల్.. ప్రతిపక్షాలను, స్వతంత్ర అభ్యర్థులను, ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే మహిళలను, యువతను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోందన్నారు.
ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం..
అదే సమయంలో క్షేత్రస్థాయిలో యంత్రాంగంపై పట్టున్న అధికార పార్టీకి ఇది అనైతికమైన ఆధిక్యతను కల్పిస్తుందని.. ఇది అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే పోటీ కాదని ఆరోపించారు. ఇది అడ్డగోలుగా సృష్టించిన 'వ్యవస్థీకృత అసమానత', అడ్డగోలుగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చే "సిస్టమాటిక్ సెట్టింగ్గా కనిపిస్తోంది" అన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈసీ షెడ్యూల్ని చూస్తే ఈసీ తన రాజ్యాంగ స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి రేవంత్రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కైందా? వారి చేతిలో కీలుబొమ్మగా మారిందా? అన్న అనుమానం ప్రజల్లో బలంగా కలుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కేవలం ఒక "మేనేజ్డ్" డ్రామాగా మార్చేయడంతో స్వేచ్ఛాయుత ఎన్నికల స్ఫూర్తి దెబ్బతింటుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్నికలు ఎంత వేగంగా అయిపోయాయన్నది ముఖ్యం కాదని. ప్రజలు ఎంత నిజాయితీగా, ప్రలోభాలకు గురికాకుండా తమ నాయకుడిని ఎంచుకున్నారన్నదే ముఖ్యమన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



