త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageswara Rao | వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పంట‌లు వేయాలి: మంత్రి తుమ్మ‌ల‌

Tummala Nageswara Rao | వాతావ‌ర‌ణ ప‌రిస్థితులకు అనుగుణంగా రైతులు పంట‌లు వేయాల‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్రంలోని తొలి కంటింజెన్సీ ప్రణాళిక (Contingency Plan)ను రూపొందించారు.

G

Telangana | Published On Jul 16, 2026, 12.58 pm IST

Tummala Nageswara Rao | వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పంట‌లు వేయాలి: మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

Tummala Nageswara Rao | త్రినేత్ర‌.న్యూస్‌: వాతావ‌ర‌ణ ప‌రిస్థితులకు అనుగుణంగా రైతులు పంట‌లు వేయాల‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ఎల్-నినో (El Nino) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్రంలోని తొలి కంటింజెన్సీ ప్రణాళిక (Contingency Plan)ను రూపొందించారు. ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార శాఖ‌ల అధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధమని చెప్పారు. వాతావరణ అంచనాలను విశ్లేషించి కార్యాచరణ రూపొందించామన్నారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారుల కోసం చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్ల‌డించారు. మండలాల వారీగా, జిల్లాల వారీగా వర్షపాతం లోటు (Rainfall Deficit) వివరాలను అందుబాటులో ఉంచి, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు మార్గదర్శకాలు రూపొందించామ‌ని తెలిపారు.

రానున్న రెండు నెలలకు సంబంధించిన వాతావరణ అంచనాలను శాస్త్రీయంగా విశ్లేషించి కార్యాచరణ ప్రణాళికలో పొందుపరిచినట్లు చెప్పారు. భారత వాతావరణ శాఖ (IMD) అందించే వాతావరణ సమాచారాన్ని రోజువారీ, వారంవారీ, నెలవారీగా సంబంధిత శాఖలతో పంచుకొని, వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందించనున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు పంటల ఎంపిక, నీటి వినియోగం, వ్యవసాయ నిర్వహణపై శాస్త్రీయ సూచనలు అందించి, పంట నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement