త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thummala Nageswar Rao | రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేస్తాం.. ఆందోళన వద్దు

ఆతృతతో రైతులు అక్కడక్కడ షాప్ ల ముందూ నిల్చున్న సందర్భములను చూపి ​యూరియా ​కొరత అని ప్రచారం చేసి మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ​అనుకుంటే రైతులు క్షమించరు.

J

Telangana | Published On Jan 2, 2026, 5.35 pm IST

Thummala Nageswar Rao | రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేస్తాం.. ఆందోళన వద్దు
Advertisement

Thummala Nageswar Rao | రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని.. రైతులకు అవసరమున్నంత మేర యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 31 నాటికే రాష్ట్రంలో 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశామన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడారు.

​యాసంగి సీజన్‌లో 2018–19 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 2.57 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ​2019–20 సంవత్సరంలో అక్టోబర్డిసెంబర్ కాలంలో మొత్తం 2.42 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు నమోదయ్యాయి. ​2020–21 సంవత్సరంలో యాసంగిలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 1.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు మాత్రమే జరిగాయి. ​2021–22 సంవత్సరంలో యాసంగి సీజన్‌లో డిసెంబర్ నాటికి 1.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ​2022–23 సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి మొత్తం 2.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ​2023–24 సంవత్సరంలో యాసంగి సీజన్‌లో డిసెంబర్ నాటికి 2.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు నమోదయ్యాయి. ​2024–25 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 3.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ​ప్రస్తుత 2025–26 యాసంగి సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి, ఇది గత 8 సంవత్సరాల్లో అత్యధికం. ​యాసంగిలో డిసెంబర్ వరకు కేంద్ర కేటాయింపులు 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు ​గాను, ​ఇప్పటికే 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకోగలిగాము.

​రాష్ట్రంలో ఉన్న 12000 సెంటర్లలో, ఎక్కడో 2,3 సెంటర్లలో ఉన్న వరసలను చూపి ​రాజకీయ పబ్బం గడపాలని అనుకుంటున్నారు. ​ఆతృతతో రైతులు అక్కడక్కడ షాప్ ల ముందూ నిల్చున్న సందర్భములను చూపి ​యూరియా ​కొరత అని ప్రచారం చేసి మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ​అనుకుంటే రైతులు క్షమించరు. ​గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్యూల సంగతి, ఆ క్యూలలో రైతులు మరణించిన ​సందర్భాల గురించి నేను మాట్లాడదల్చుకోలేదు. ​ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ రాష్ట్రంలో కూడా ​అమలు చేసాము. ​ఆ యాప్ ను ఉపయోగించిన పత్తి రైతులలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువ. ​వారు కూడా ఈ యాప్ ని వినియోగించి పత్తి అమ్మకాలు చేస్తున్నారు. ​ఈ యాప్ ఆధారంగా యూరియా యాప్ ను రాష్ట్రంలో 5 జిల్లాలలో ​ప్రయోగాత్మకంగా​చేపట్టడం జరిగింది. ​యాప్ మీద కూడా లేని పోని అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు ​చేయడం దురదృష్టం. ​ఈ యాప్ ను తీసుకొచ్చే ముందు రైతులందరికీ అవగాహన కల్పించాం. ​ప్రతీ రిటైల్ అవుట్ లెట్ దగ్గర ఒక వాలంటీర్ ను ఉంచడం జరిగింది. ​ఈ యాప్ ప్రయోగాత్మక దశలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలన్నింటిని ​ఒక్కొక్కటిగా ​పరిష్కరించాం. ​కౌలు రైతులకు, పట్టాలు లేని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకొన్నాం. ​నేను స్వయంగా రైతు వేదికల ద్వారా ఆయా జిల్లాల రైతులతో మాట్లాడితే వారు ​సంతృప్తి వ్యక్తం చేశారు. ​యాప్ ద్వారా డిసెంబర్ 20వ తేది నుండి ఇప్పటివరకు 1.18 లక్షల మంది రైతులు.. ​3.36 ​లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement