త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Session | దావోస్‌లో 44 కంపెనీల‌తో ఎంవోయూలు.. 6 కంపెనీల‌కు భూ కేటాయింపులు

Assembly Session | గ‌త రెండేండ్ల‌లో దావోస్ (Davos) ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. 44 కంపెనీల‌తో ప్ర‌భుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్న‌ద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 6 కంపెనీల‌కు భూ కేటాయింపులు జ‌రిగాయ‌న్నారు

G

Telangana | Published On Mar 26, 2026, 11.06 am IST

Assembly Session | దావోస్‌లో 44 కంపెనీల‌తో ఎంవోయూలు.. 6 కంపెనీల‌కు భూ కేటాయింపులు
Advertisement

Assembly Session | త్రినేత్ర‌.న్యూస్‌: గ‌త రెండేండ్ల‌లో దావోస్ (Davos) ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. 44 కంపెనీల‌తో ప్ర‌భుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్న‌ద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 6 కంపెనీల‌కు భూ కేటాయింపులు జ‌రిగాయ‌ని, మ‌రో 3 కంపెనీలకు కేటాయించేందుకు భూములను గుర్తించామ‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున 2024, 2025లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్ర‌తినిధుల బృందం దావోస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సుల్లో (WEF Summit) పాల్గొన్న విష‌యం తెలిసిందే. దావోస్ పెట్టుబ‌డుల‌పై ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పాయల్ శంకర్, ధన్ పాల్ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో (Assembly Session) స‌మాధానం చెప్పారు.

`దావోస్ పర్యటనల్లో 44 ఎంవోయూలు ప్రభుత్వం కుదుర్చుకుందని, పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. 2024 దావోస్‌లో 18 ఎంవోయూలు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 2025లో 26 ఎంవోయూలు రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూముల కేటాయింపు జరిగింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 3 కంపెనీలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూముల గుర్తింపు జరిగింది` అని తెలిపారు. నిజామాబాద్‌లో 681 సీట్ల సామర్థ్యంతో ఐటీ టవర్ నిర్మించామన్న మంత్రి, ఐటీ టవర్‌లో 11 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అందులో ప్రస్తుతం 276 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని స్పష్టం చేశారు.

https://x.com/TeluguScribe/status/2037038250595147981

Advertisement

తాజావార్తలు

Advertisement