త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | దమ్ముంటే ఢిల్లీ వెళ్లి మోదీని నిలదీయండి

తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

J

Telangana | Published On Sep 3, 2026, 3.09 pm IST

Ponnam Prabhakar | దమ్ముంటే ఢిల్లీ వెళ్లి మోదీని నిలదీయండి
Advertisement
  • పార్టీలో ఉనికి కాపాడుకునేందుకే బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
  • తెలంగాణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని మోదీని నిలదీయాలని సవాల్
  • పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్తున్నా, తిరిగి ఫండ్స్ ఇవ్వడంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శ
  • మెట్రో రైల్, నవోదయ విద్యాలయాలు, RRR వంటి పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే పచ్చజెండా ఊపాలని డిమాండ్

Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో ఉనికిని కాపాడుకునేందుకే కమలనాథులు ఒకరిని మించి ఒకరు విమర్శలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం అధికార పార్టీని విమర్శిస్తే ఢిల్లీ హైకమాండ్ తమను గుర్తిస్తుందనే భ్రమలో వాళ్లు ఉన్నారని చురకలంటించారు.

బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గల్లీలో కాంగ్రెస్ ను విమర్శించడం కాదు.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని నిలదీయాలని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులపై వాళ్లు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నుంచి భారీగా ఫండ్స్, ప్రాజెక్టులు వస్తున్నాయని.. కానీ తెలంగాణకు ఎందుకు ఆ విధంగా రావడం లేదో కమలనాథులు ఆన్సర్ చేయాలన్నారు.

గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ వేల కోట్ల బకాయిలు పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపలేదని మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం తమ పీపుల్స్ గవర్నమెంట్ (People's Government) పాత బకాయిలను సైతం క్లియర్ చేస్తూ పారదర్శకంగా పేమెంట్స్ చేస్తోందని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పుష్కర కాలం దాటుతున్నా.. తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు.

ఫెడరల్ సిస్టమ్ (Federal System) లో రాష్ట్రానికి దక్కాల్సిన పన్నుల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ఫైట్ చేస్తోందని మంత్రి తెలిపారు. ట్యాక్స్ ల రూపంలో తెలంగాణ నుంచి భారీగా ఆదాయం కేంద్రానికి వెళ్తోందని, కానీ రిటర్న్ ఫండ్స్ విషయంలో మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ (Metro Rail) విస్తరణ, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, రీజినల్ రింగ్ రోడ్ (RRR) తో సహా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. టైమ్ పాస్ పాలిటిక్స్ పక్కనపెట్టి, తెలంగాణ హక్కుల కోసం ఫైట్ చేసే దమ్ము బీజేపీ నేతలు చూపించాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement