త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ క‌ట్టిన మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క‌

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మంత్రులు కొండా సురేఖ‌ (Konda Surekha), సీత‌క్క (Seethakka) రాఖీ క‌ట్టారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఇద్ద‌రు మంత్రులు.. ముఖ్య‌మంత్రికి రాఖీలు (Rakhi Pournami) క‌ట్టి, మిఠాయిలు తినిపించి హృద‌య‌పూర్వ‌క పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

G

Telangana | Published On Aug 28, 2026, 12.04 pm IST

Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ క‌ట్టిన మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మంత్రులు కొండా సురేఖ‌ (Konda Surekha), సీత‌క్క (Seethakka) రాఖీ క‌ట్టారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఇద్ద‌రు మంత్రులు.. ముఖ్య‌మంత్రికి రాఖీలు (Rakhi Pournami) క‌ట్టి, మిఠాయిలు తినిపించి హృద‌య‌పూర్వ‌క పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆత్మీయ కలయికలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.

ప‌ర‌కాల వివాదం త‌ర్వాత కొండా సురేఖ‌.. సీఎం నివాసానికి వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. సీఎంతో భేటీ అనంత‌రం కొండా సురేఖ మీడియాతో మాట్లాడ‌కుండానే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. అనంత‌రం కొండా సురేఖ త‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తి ఏడాది లాగానే సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ క‌ట్టాన‌ని చెప్పారు. ప్ర‌త్యేకంగా బంగారు రాఖీ చేయించాన‌ని తెలిపారు. వారికి ఆడ‌ప‌డుచులంద‌రి దీవెన ఉంటుంది. సుప‌రిపాల‌న‌ను అందించాల‌ని, తెలంగాణ‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు న‌డిపించడానికి శ‌క్తిని, యుక్తిని ఇవ్వాల‌ని, ముఖ్య‌మంత్రి ఆశీర్వాదం కూడా ఆడ‌ప‌డుచులంద‌రిపై ఉండాల‌ని కోరుకుంటున్నాన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాల‌తో ఐశ్వ‌ర్యాల‌తో విల‌సిల్లాల‌ని ఆకాంక్షించారు.

 

 

Advertisement
Advertisement