త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Raja Narasimha | సామాన్యుడి త‌ల‌రాత‌ను మార్చే ఏకైక ఆయుధం విద్య : మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌

Damodar Raja Narasimha | పేదరికం అనే సంకెళ్లను తెంచి, సామాన్యుడి తలరాతను మార్చే శక్తి ఉన్న ఏకైక ఆయుధం విద్య మాత్రమేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

S

Telangana | Published On Jan 6, 2026, 1.16 pm IST

Damodar Raja Narasimha | సామాన్యుడి త‌ల‌రాత‌ను మార్చే ఏకైక ఆయుధం విద్య : మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌
Advertisement

Damodar Raja Narasimha | త్రినేత్ర‌.న్యూస్ : పేదరికం అనే సంకెళ్లను తెంచి, సామాన్యుడి తలరాతను మార్చే శక్తి ఉన్న ఏకైక ఆయుధం విద్య మాత్రమేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. తరగతి గదిలో నేర్పే చదువే... రేపటి సమాజాన్ని, దేశ భవిష్యత్‌ను నిర్మించే అసలైన పునాది అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శాసనమండలిలో గురుకులాల టైమ్ టేబులు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు చెప్పారు.

గతంలో సరియైన సౌకర్యాలు లేని అద్దె భవనాల్లో గురుకులాలను ప్రారంభించారని, దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని మంత్రి తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పాలసీని తీసుకొచ్చామన్నారు. ఒక్కో స్కూల్‌ను రూ. 200 కోట్లతో, 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామన్నారు.

గురుకుల విద్యా సంస్థల్లో టైమ్ టేబుల్‌ను మార్చే అంశాన్ని పరిశీలించి.. విద్యార్థులు, టీచర్ల సౌకర్యం మేరకు అవసరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపై అధ్యయనం కోసం కేశవరావు (కేకే) అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. కమిటీ నివేదిక వచ్చాక.. రాష్ట్ర విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎన్‌ఈపీ అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement