త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NTV Journalists | మ‌హిళా ఐఏఎస్ అధికారిణిపై క‌థ‌నం.. ఎన్టీవీ జ‌ర్నలిస్టుల‌కు బెయిల్‌

NTV Journalists | మ‌హిళా ఐఏఎస్ అధికారిణిపై క‌థ‌నం కేసులో అరెస్ట‌యిన ఎన్‌టీవీ జ‌ర్న‌లిస్టుల‌కు (NTV Journalists) బెయిల్ ల‌భించింది.

G

Telangana | Published On Jan 15, 2026, 10.06 am IST

NTV Journalists | మ‌హిళా ఐఏఎస్ అధికారిణిపై క‌థ‌నం.. ఎన్టీవీ జ‌ర్నలిస్టుల‌కు బెయిల్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళా ఐఏఎస్ అధికారిణిపై క‌థ‌నం కేసులో అరెస్ట‌యిన ఎన్‌టీవీ జ‌ర్న‌లిస్టుల‌కు (NTV Journalists) బెయిల్ ల‌భించింది. ఓ మంత్రితో మ‌హిళా ఐఏఎస్‌కు అక్ర‌మ సంబంధం ఉందంటూ వ్య‌క్తిత్వ హ‌ననం జ‌రిగేలా ఎన్టీవీ క‌థ‌నం ప్ర‌సారం చేసింది. ఈ వ్య‌వ‌హారంలో ఐఏఎస్ అధికారుల సంఘం ఎన్‌టీవీ స‌హా ప‌లు డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌పై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసులో స‌మ‌గ్ర విచార‌ణ కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఎన్టీవీకి చెందిన ముగ్గురు జ‌ర్న‌లిస్టులు దొంతు ర‌మేశ్‌, సుధీర్‌, ప‌రిపూర్ణాచారిని మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ప‌రిపూర్ణాచారిని విచారించి వ‌దిలేశారు.

మిగిలిన ఇద్ద‌రిని మణికొండలోని ఇన్‌చార్జి 14వ ఏసీఎంఎం మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచారు. కేసుకి సంబంధించి వాదనలను విన్న మేజిస్ట్రేట్ జర్నలిస్టులకు రిమాండ్‌ విధించాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో వారిని విడుద‌ల చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement