త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mee Seva | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు షాకింగ్ న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో స‌ర్వీసు ఛార్జీలు పెంపు

Mee Seva | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు షాకింగ్ న్యూస్. ప్రభుత్వ నుంచి పొందే సేవ‌ల కోసం ప్ర‌తి పౌరుడు కూడా మీ సేవ కేంద్రాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అయితే మీ సేవ కేంద్రాల్లో పొందే సేవ‌ల‌కు భారీగా స‌ర్వీస్ ఛార్జీల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

S

Telangana | Published On Apr 1, 2026, 5.43 pm IST

Mee Seva | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు షాకింగ్ న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో స‌ర్వీసు ఛార్జీలు పెంపు
Advertisement

Mee Seva | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు షాకింగ్ న్యూస్. ప్రభుత్వ నుంచి పొందే సేవ‌ల కోసం ప్ర‌తి పౌరుడు కూడా మీ సేవ కేంద్రాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అయితే మీ సేవ కేంద్రాల్లో పొందే సేవ‌ల‌కు భారీగా స‌ర్వీస్ ఛార్జీల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అన్ని సర్వీసుల‌పై సుమారు 50 శాతం ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెంచిన ఛార్జీలు బుధ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

'ఏ' కేటగిరీ సర్వీసులకు రూ. 62 చొప్పున‌, 'బి' కేటగిరీ సర్వీసులకు రూ. 80 చొప్పున వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో కనీస ఛార్జీలు రూ. 35 చొప్పున‌ ఉంటే ప్రస్తుతం రూ. 62కు పెంచారు.

కుల‌, ఆదాయ‌, నివాస ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, ఆహార భ‌ద్ర‌త కార్డు, ఓబీసీ స‌ర్టిఫికెట్, విద్యుత్ క‌నెక్ష‌న్, ఈడ‌బ్ల్యూఎస్ స‌ర్టిఫికెట్, క్రిమీ, నాన్ క్రిమీలేయ‌ర్ ద‌ర‌ఖాస్తు, భూభార‌తి ఈకేవైసీ స‌ర్వీస్, ఈబీసీ స‌ర్టిఫికెట్ పొందాలంటే రూ. 80 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈసీకి, బ‌ర్త్ స‌ర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవాలంటే రూ. 62 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement