త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajender | జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డుపై కేంద్రానికి ఫిర్యాదు చేశా : ఎంపీ ఈట‌ల‌

Etala Rajender | జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్ర‌జ‌ల ఊపిరి తీసేలా ఏర్ప‌డిన డంప్ యార్డ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన‌ట్లు మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. గుట్టలు గుట్ట‌లుగా పేరుకుపోయిన చెత్త‌ను రీసైకిల్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Aug 5, 2026, 4.26 pm IST

Etala Rajender | జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డుపై కేంద్రానికి ఫిర్యాదు చేశా : ఎంపీ ఈట‌ల‌
Advertisement

Etala Rajender | త్రినేత్ర‌.న్యూస్ : జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్ర‌జ‌ల ఊపిరి తీసేలా ఏర్ప‌డిన డంప్ యార్డ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన‌ట్లు మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. గుట్టలు గుట్ట‌లుగా పేరుకుపోయిన చెత్త‌ను రీసైకిల్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ జనాభా 30 లక్షల మంది ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది జవహర్ నగర్ డంపుయార్డ్. ఇప్పుడు రెండు కోట్ల మంది జనాభాకు కూడా అక్కడ ఒక్కదగ్గరే చెత్త వేస్తున్నారు. ⁠గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వల్ల 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ⁠లక్షలమంది ఆరోగ్యం దెబ్బతిన్నది. సంపాదించినదంతా హాస్పిటల్స్‌కి ఖర్చు చేయాల్సి వస్తుంది. ⁠ఈ విషయంపై కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ని కలిశాను.. 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఒక దగ్గర వేయడం శ్రేయస్కరం కాదని.. శాశ్వత పరిష్కారం చూపాలని కోరాను. ఒక్క కిలో చెత్త కూడా వేయకుండా చూడాలని కోరిన‌ట్లు ఎంపీ ఈట‌ల తెలిపారు.

⁠వాయు, నీటి కాలుష్యం లేకుండా జీరో పొల్యూషన్‌తో చెత్తను రీసైకిల్ చేయించాలని విజ్ఞప్తి చేశాను. ⁠ఢిల్లీ లాంటి నగరంలో చెత్తను మేనేజ్ చేస్తున్నాము.. హైదరాబాద్‌లో కూడా ఆ పద్ధతులు అవలంబించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ⁠ఎలక్ట్రిసిటీ జనరేట్ స్టేషన్ ఉన్నా అది పని చేస్తుందో లేదో తెలియదు. పర్యవేక్షణ లేదు. దాని కెపాసిటీ 3500 మెట్రిక్ టన్నులు అయితే వచ్చేది 10 వేల మెట్రిక్ టన్నులు. ⁠నేను సుప్రీం కోర్టులో కేసు వేశాను. అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా కేసు వేశారు.. ఆయనే ఇప్పుడు సీఎం అయ్యారు అయినా ఫలితం లేకుండా పోయిందని ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement