PGRRCDE | పీజీఆర్ఆర్సీడీఈ దూరవిద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
PGRRCDE | ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జీ రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు కేంద్రం డైరెక్టర్ తెలిపారు.
- సెప్టెంబర్ 11 వరకు అవకాశం
- అక్టోబర్ 15 నుంచి ఆన్లైన్ తరగతులు
PGRRCDE | ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జీ రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ, వివిధ విభాగాల్లో ఎంఏ, ఎంకామ్, గణితం, గణాంకశాస్త్రంలో ఎమ్మెస్సీ, బీఏ (నిర్దిష్ట కాంబినేషన్లు), బీకామ్ (జనరల్), బీబీఏతో పాటు అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు, వేద జ్యోతిష్యంలో అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా, యోగా సర్టిఫికేట్ కోర్సు, ఇతర సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రతి కోర్సుకు అర్హత నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని అధికారులు తెలిపారు. యూజీసీ–డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (UGC-DEB) మార్గదర్శకాల మేరకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) విధానంలో ఈ కోర్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ ప్రవేశ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభమైందని, దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్ 11 చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. అన్ని కోర్సులకు ఆన్లైన్ కాంటాక్ట్ తరగతులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. పీజీ కోర్సుల వ్యవధి రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు), యూజీ కోర్సుల వ్యవధి మూడు సంవత్సరాలు (ఆరు సెమిస్టర్లు) ఉంటుంది.
యోగా సర్టిఫికేట్ కోర్సు ఒక సంవత్సరం, ఇతర సర్టిఫికేట్ కోర్సులు ఆరు నెలల వ్యవధిలో పూర్తవుతాయి. కోర్సుల అర్హత, ఫీజు నిర్మాణం, సిలబస్, బోధనా మాధ్యమం, ఈ-లెర్నింగ్ మెటీరియల్, అకాడెమిక్ క్యాలెండర్, ఆన్లైన్ నమోదు, ప్రవేశ విధానం తదితర పూర్తి వివరాలను పీజీఆర్ఆర్సీడీఈ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉందని డైరెక్టర్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారందరికీ సౌకర్యవంతమైన, నాణ్యమైన విద్యను అందించడమే కేంద్రం లక్ష్యమని ఆయన వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Devendra Mahto Hunger Strike | నిరాహార దీక్ష చేయ్.. కానీ నీళ్లు తాగు : దేవేంద్ర నాథ్ మహతోకు నచ్చజెప్పిన వాంగ్చుక్
- ●DGP CV Anand | డయల్ 112తో మరింత వేగంగా అత్యవసర సేవలు
- ●Samsung | శాంసంగ్ బంపర్ ఆఫర్.. ఫోల్డబుల్ ఫోన్లపై 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ.. జీరో డౌన్ పేమెంట్తో..
- ●Mark Zuckerberg Apology | '3 రోజుల్లో క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే!': మార్క్ జుకర్బర్గ్కు పార్లమెంటరీ కమిటీ తీవ్ర హెచ్చరిక
- ●Supreme Court | కోర్టు విచారణలపై వార్తా సంస్థలు రిపోర్టింగ్ చేయొచ్చు.. కానీ : సుప్రీంకోర్టు
- ●Indian Railways | ఆర్ఏసీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. ఏసీ కోచ్లలో పూర్తి బెడ్రోల్ తప్పనిసరి..

Devendra Mahto Hunger Strike | నిరాహార దీక్ష చేయ్.. కానీ నీళ్లు తాగు : దేవేంద్ర నాథ్ మహతోకు నచ్చజెప్పిన వాంగ్చుక్

DGP CV Anand | డయల్ 112తో మరింత వేగంగా అత్యవసర సేవలు

Samsung | శాంసంగ్ బంపర్ ఆఫర్.. ఫోల్డబుల్ ఫోన్లపై 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ.. జీరో డౌన్ పేమెంట్తో..

Mark Zuckerberg Apology | '3 రోజుల్లో క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే!': మార్క్ జుకర్బర్గ్కు పార్లమెంటరీ కమిటీ తీవ్ర హెచ్చరిక





