త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gutha Sukhender Reddy | డీలిమిటేష‌న్ జ‌రిగితే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం : మండ‌లి చైర్మ‌న్ గుత్తా

Gutha Sukhender Reddy | జ‌నాభా ప్ర‌తిపాదిక‌న డీలిమిటేష‌న్ జ‌రిగితే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయ‌న బుధ‌వారం మీడియాతో చిట్ చాట్ చేశారు.

S

Telangana | Published On Apr 15, 2026, 2.07 pm IST

Gutha Sukhender Reddy | డీలిమిటేష‌న్ జ‌రిగితే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం : మండ‌లి చైర్మ‌న్ గుత్తా
Advertisement

Gutha Sukhender Reddy | త్రినేత్ర‌.న్యూస్ : జ‌నాభా ప్ర‌తిపాదిక‌న డీలిమిటేష‌న్ జ‌రిగితే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయ‌న బుధ‌వారం మీడియాతో చిట్ చాట్ చేశారు.

ఈ నెల 16న ప్ర‌వేశ‌పెట్టే బిల్లుతో ఉన్న సీట్ల‌కు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్ర‌తిపాదించింది. 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వేరువేరుగా పెట్టాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. జమిలీ ఎన్నికలు జరిగితే 18 రాష్ట్రాలు ఒకసారి, మిగిలిన రాష్ట్రాలు ఒకసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది అని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో వివిధ రాష్ట్రాల నుంచి 20 లక్షల మంది కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారు. డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేస్తే తప్ప భవిష్యత్ రాజకీయాల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్‌ను టీఆర్ఎస్‌గా మారుస్తారని ప్రచారం నడుస్తుంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ఎందుకు మార్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలి అని సుఖేంద‌ర్ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement