త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సిరిసిల్ల నేత‌న్న‌ల‌ను విద్యుత్ సంక్షోభం నుంచి కాపాడండి.. బ్యాక్ బిల్లింగ్ భారంతో ప్ర‌మాదంలో వేలాది కుటుంబాల జీవనోపాధి: కేటీఆర్

KTR | సిరిసిల్ల (Sircilla) నేత‌న్న‌ల‌ను విద్యుత్ సంక్షోభం నుంచి కాపాడాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని, సిరిసిల్ల ప‌వ‌ర్‌లూమ్ యూనిట్ల‌పై ఉన్న విద్యుత్ బ‌కాయిలు, సర్‌చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలన్నారు.

G

Telangana | Published On Mar 25, 2026, 11.57 am IST

KTR | సిరిసిల్ల నేత‌న్న‌ల‌ను విద్యుత్ సంక్షోభం నుంచి కాపాడండి.. బ్యాక్ బిల్లింగ్ భారంతో ప్ర‌మాదంలో వేలాది కుటుంబాల జీవనోపాధి: కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: సిరిసిల్ల (Sircilla) నేత‌న్న‌ల‌ను విద్యుత్ సంక్షోభం నుంచి కాపాడాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని, సిరిసిల్ల ప‌వ‌ర్‌లూమ్ యూనిట్ల‌పై ఉన్న విద్యుత్ బ‌కాయిలు, సర్‌చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలన్నారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి విన‌ప‌త్రం అంద‌జేశారు.

సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్‌పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడంతో పరిశ్రమ నిలదొక్కుకుందన్నారు. అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని మంత్రుల‌కు వివరించారు. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాల‌ని తెలిపారు.

38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి

2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్‌ఎస్‌ఐ (SSI) యూనిట్లపై అధికారులు రూ.19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ.38 కోట్లకు చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను అదుకోవాలన్నారు.

లేఖ‌లో ఉన్న అంశాలివే..

  • సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలి.
  • పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలి.
  • కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలి.
  • సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానిది కాదని, అది వేలాది కుటుంబాల మనుగడకు సంబంధించినదని కేటీఆర్ గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement

తాజావార్తలు

Advertisement