త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kunamneni Sambasiva Rao | 22A ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టడం అవాస్తవం

22A చట్టం ద్వారా కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

J

Telangana | Published On Sep 16, 2026, 12.27 pm IST

Kunamneni Sambasiva Rao | 22A ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టడం అవాస్తవం

సంక్షిప్త సారాంశం

22A నిబంధన ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారనడం పూర్తిగా ఆవాస్తవమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ అంశంపై తాను అన్ని విషయాలు క్లారిటీగా పరిశీలించానని అసెంబ్లీలో తెలిపారు. ఈ నిబంధనను ప్రస్తుత ప్రభుత్వమే ఇప్పుడే కొత్తగా తెచ్చిందనడంలో కూడా నిజం లేదని స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న ప్రచారాలు, విమర్శలు వాస్తవ దూరమని కొట్టిపారేశారు.

Advertisement
  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో 22A భూముల నిషేధిత జాబితా అంశంపై సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టతనిచ్చారు. 22A నిబంధన కింద కోటి ఎకరాల భూమిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ అంశంపై సభలో మాట్లాడిన ఆయన, దీనికి సంబంధించి వస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.

పూర్తి క్లారిటీ తీసుకున్నానన్న కూనంనేని

ఈ వివాదంపై తాను పూర్తిగా క్లారిటీగా పరిశీలించానని కూనంనేని తెలిపారు. "దీనిలో అక్కడక్కడ కొన్ని తప్పులు ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం నూటికి నూరు శాతం సత్య దూరం. అదేమిటంటే.. కోటి ఎకరాలను 22A జాబితాలో పెట్టారనేది పూర్తిగా అవాస్తవం" అని ఆయన పునరుద్ఘాటించారు.

ఇప్పుడే తెచ్చిన నిబంధన కాదు

ఈ నిబంధనను కేవలం ఇప్పుడే కొత్తగా తీసుకువచ్చినట్లు చెబుతున్నారని, అది కూడా అవాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ లేదా చట్టపరమైన ప్రక్రియలో ఉన్న నిబంధనలపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మాల్సిన అవసరం లేదని ఆయన అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

Advertisement
Advertisement