త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | ఉద్య‌మ నాయ‌కుడిగా కేసీఆర్ అంటే గౌర‌వం: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌

Mahesh Kumar Goud | ఉద్య‌మ నాయ‌కుడిగా కేసీఆర్ (KCR) అంటే త‌మ‌కు గౌర‌వం ఉంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు (TPCC President) మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో నోటీసుల అంశంపై త‌న‌కు స్ప‌ష్ట‌త లేద‌ని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విష‌యంలో పార‌ద‌ర్శ‌క విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు.

A

Telangana | Published On Jan 29, 2026, 4.18 pm IST

Mahesh Kumar Goud | ఉద్య‌మ నాయ‌కుడిగా కేసీఆర్ అంటే గౌర‌వం: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌
Advertisement

Mahesh Kumar Goud | ఉద్య‌మ నాయ‌కుడిగా కేసీఆర్ (KCR) అంటే త‌మ‌కు గౌర‌వం ఉంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు (TPCC President) మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో ఎవ‌రు భాగ‌స్వాములో తేలాల్సి ఉంద‌ని చెప్పారు. ఈ కేసులో నోటీసుల అంశంపై త‌న‌కు స్ప‌ష్ట‌త లేద‌ని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విష‌యంలో పార‌ద‌ర్శ‌క విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు. 500కు పైగా ఫోన్ నంబ‌ర్లు ట్యాప్ అయ్యాయ‌నే స‌మాచారం ఉంద‌ని, జ‌రిగిన వాస్త‌వాలు తెలుసుకునేందుకు సిట్ ఎవ‌రికైనా నోటీసులు ఇవ్వొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆనాటి ముఖ్య‌మంత్రి, మంత్రుల ప్ర‌మేయం లేకుండా ఇలాంటివి జ‌ర‌గ‌వ‌ని చెప్పారు. అధికారులు మాత్ర‌మే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌ర‌ని పేర్కొన్నారు. సిట్ సంపూర్ణ విచార‌ణ జ‌రిగితేనే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు. విచార‌ణ‌లో వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డంపై ఎలాంటి రాజ‌కీయ దురుద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు గెల్చుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అటువంటి స‌మ‌యంలో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో బీఫామ్‌ల విష‌యంలో ఇంచార్జి మంత్రుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన‌ట్లు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement