త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | రేట్ల విష‌యంలో ప‌ట్టిపీడిస్తున్న అగ్రిగేట‌ర్లు.. ప్ర‌భుత్వం గిగ్ వ‌ర్క‌ర్స్ ప‌క్షాన నిల‌బ‌డాలి: క‌విత

Kavitha | ఉబర్, ఓలా, ర్యాపిడో నడిపేవారికి అగ్రిగేట‌ర్లు సరైన ధర ఇవ్వడంలేద‌ని, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలూ డెలివరీ బాయ్స్‌ను ప‌ట్టి పీడిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు.

G

Telangana | Published On Jul 22, 2026, 1.27 pm IST

Kavitha | రేట్ల విష‌యంలో ప‌ట్టిపీడిస్తున్న అగ్రిగేట‌ర్లు.. ప్ర‌భుత్వం గిగ్ వ‌ర్క‌ర్స్ ప‌క్షాన నిల‌బ‌డాలి: క‌విత
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: ఉబర్, ఓలా, ర్యాపిడో నడిపేవారికి అగ్రిగేట‌ర్లు సరైన ధర ఇవ్వడంలేద‌ని, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలూ డెలివరీ బాయ్స్‌ను ప‌ట్టి పీడిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. గిగ్ వ‌ర్క‌ర్లు (Gig Workers) రోజంతా క‌ష్ట‌ప‌డినా వారి ఆదాయం కుటుంబ పోష‌ణ‌కు కూడా స‌రిపోవ‌డం లేద‌ని, మూడేండ్లుగా రేట్లు పెంచాల‌ని డిమాండ్ చేస్తున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అగ్రిగేటర్ సంస్థలు వారికి సరిపడ ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయ‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారంలో ప్రభుత్వం వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని, ఆయా సంస్థలతో మాట్లాడి సరైన ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం గిగ్ వ‌ర్క‌ర్లు, ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్ల (Cab Drivers) ప‌క్షాన నిల‌బ‌డాల‌ని డిమాండ్ చేశారు. గిగ్‌వ‌ర్క‌ర్లు బుధ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు బ్రేక్ డౌన్ చేస్తున్నార‌ని, ఇలాంటి ఉద్య‌మాలు చేసే ప‌రిస్థితి లేకుండా వారి ప‌క్షాన ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల‌ని హెచ్చ‌రించారు. వారి బ్రేక్ డౌన్ ఆందోళనకు టీఆర్‌ఎస్‌ మద్దతుగా ఉంటుంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement