త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్‌పై సీపీ చ‌ర్య‌లు తీసుకోవాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

Kaushik Reddy | మీడియా వక్రీకరించకుండా తాను చెప్పింది చెప్పిన‌ట్లుగా రాస్తే కరీంనగర్ యువతకు లాభం జ‌రుగుతుంద‌ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. క‌రీంన‌గ‌ర్ సీపీ ఫైరింగ్‌పై మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు విచార‌ణ చేయిస్తామ‌న్నారు.

P

Telangana | Published On Mar 18, 2026, 6.51 pm IST

Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్‌పై సీపీ చ‌ర్య‌లు తీసుకోవాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
Advertisement

Kaushik Reddy | మీడియా వక్రీకరించకుండా తాను చెప్పింది చెప్పిన‌ట్లుగా రాస్తే కరీంనగర్ యువతకు లాభం జ‌రుగుతుంద‌ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. క‌రీంన‌గ‌ర్ సీపీ ఫైరింగ్‌పై మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు విచార‌ణ చేయిస్తామ‌న్నారు. తాను ఆరోపణలు చేసిన తర్వాత సీపీ ప్రెస్‌కు ఆ రోజు నేను సెలవులో ఉన్నానంటూ లెట‌ర్ రిలీజ్ చేశార‌ని గుర్తు చేశారు. లెటర్ మొత్తం ప్రింట్ చేసి, సీపీ 19వ తేదీ ఎందుకు పెన్నుతో రాశారు? దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, భద్రతను కాపాడిన పోలీసులు ఇలా చేస్తే ఎలా?.. సీపీకి సెలవు ఇచ్చేది డీజీపీ అని, కానీ ఇక్కడ సీపీకి సెలవు ఐజీ ఎలా ఇస్తారు? ప్ర‌శ్నించారు. ఫైరింగ్ జరిగిన ప్రదేశంలో ప్యాచ్ వర్క్ కూడా చేశార‌ని, ఇది నిజం కదా? అంటూ నిల‌దీశారు.

కేసులు మా మీద పెట్టడం కాద‌ని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల‌న్నారు. కాలయాపన చేస్తే నష్టపోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం మంత్రని, ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాల‌న్నారు. పీకల్లోతు మందు తాగి కరీంనగర్‌లో పోలీసులు జల్సాలు చేస్తున్నార‌న్నారు. కరీంనగర్ సీపీపై 30వ తేదీ వరకూ చర్యలు తీసుకుపోతే మరిన్ని విషయాలు బయటికి వ‌స్తాయ‌న్నారు. దొంగ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్త‌ని, త‌న‌కు పోలీసు వ్యవస్థపై గౌరవం ఉంద‌న్నారు. హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐపై చర్యలు తీసుకోవాల‌న్నారు. తాను తప్పు మాట్లాడితే.. అబద్ధమైతే అసెంబ్లీ ముందు ముక్కు నెలకు రాస్తార‌న్నారు. ఒక్క సీపీతో పోలీసు వ్యవస్థకు చడ్డపేరు వ‌స్తుంద‌ని, సీపీపై వెంటనే చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement