త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | జ‌ర్న‌లిస్టుల అర్ధ‌రాత్రి అరెస్టుల‌ను ఖండించిన జ‌గ్గారెడ్డి

Jagga Reddy | త్రినేత్ర‌.న్యూస్ : జ‌ర్నలిస్టుల అర్ధ‌రాత్రి అరెస్ట‌ల‌ను (Midnight Arrests of Journalists) టీపీసీసీ (TPCC) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా ఖండించారు. ఎవ‌రినైనా విచారించాలంటే నోటీసులు ఇచ్చి, పిల‌వాల‌ని కోరారు.

A

Telangana | Published On Jan 14, 2026, 2.02 pm IST

Jagga Reddy | జ‌ర్న‌లిస్టుల అర్ధ‌రాత్రి అరెస్టుల‌ను ఖండించిన జ‌గ్గారెడ్డి
Advertisement

Jagga Reddy | త్రినేత్ర‌.న్యూస్ : జ‌ర్నలిస్టుల అర్ధ‌రాత్రి అరెస్ట‌ల‌ను (Midnight Arrests of Journalists) టీపీసీసీ (TPCC) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా ఖండించారు. సిట్ (SIT) అధికారులు దీనిప‌ట్ల సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఎవ‌రినైనా విచారించాలంటే నోటీసులు ఇచ్చి, పిల‌వాల‌ని కోరారు. జ‌ర్న‌లిస్టుల‌ను అర్ధ‌రాత్రి అరెస్టు చేయ‌డం వ‌ల‌న ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట వ‌స్తుంద‌ని, ఇది ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా మారుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటీవ‌ల కొన్ని చాన‌ళ్ల‌లో మంత్రులు, ఉన్న‌తాధికారులపై వ్య‌క్తిగ‌తంగా ఆధారాలు లేకుండా కించ‌ప‌రిచే విధంగా క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని గుర్తు చేశారు. ఆ విష‌యంలోనూ తాను తీవ్రంగా స్పందించాన‌ని చెప్పారు. అలాంటి వార్తలు వేయడం సమాజానికి మంచిది కాదని ఇలాంటిది జరగకూడదని చెప్పాన‌న్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఆ స్థాయికి ఎదిగేందుకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో.. వారి జీవితాలను ఇలా ప్రసారం చేయడం దుర్మార్గమని చెప్పాన‌ని వివ‌రించారు.

వార్త‌ల నేప‌థ్యంలో అస‌లు విష‌యాలేమిటి, దీనికి సూత్ర‌ధారులు ఎవ‌ర‌నేది తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింద‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. ఇది మంచిదేన‌ని, దానికి స‌జ్జ‌నార్ (Sajjanar) వంటి సీనియ‌ర్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయ‌డంతో నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. సిట్ అధికారులు ఈ విషయంలో చాలా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎవరి మీద అయితే అనుమానం ఉన్నదో.. ఎవరినైతే విచారణ చేయాలని అనుకుంటున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే చాలా బాగుండేద‌న్నారు. పండుగ పూట సీనియర్ జర్నలిస్ట్ లను విచారణ పేరుతో మధ్యరాత్రి అరెస్టులు చేసి తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వం ఇబ్బందుల పాలు అవుతోంద‌న్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారన్న వార్త ఒక భయాందోళనకు గురి చేస్తోంద‌ని చెప్పారు. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా ఉపయోగేపడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

సిట్ అధికారులు చాలా కూల్ మైండ్ తో సంయమనం పాటించి విచార‌ణ జ‌రిపాల‌ని కోరారు. అటు అధికారుల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు. ఇలాంటివి మ‌రోసారి పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌ని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement