త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | జ‌ర్న‌లిస్టులా.. తీవ్ర‌వాదులా.. : హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: పండుగ వేళ అర్ధ‌రాత్రి స‌మ‌యంలో జర్నలిస్టుల (Journalists) ను అరెస్టు చేయ‌డంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

A

Telangana | Published On Jan 14, 2026, 11.14 am IST

Harish Rao | జ‌ర్న‌లిస్టులా.. తీవ్ర‌వాదులా.. : హ‌రీశ్‌రావు
Advertisement

రాజ‌కీయ వికృత క్రీడ‌లో తెలంగాణ ఉద్య‌మ‌కారులైన జ‌ర్న‌లిస్టుల‌ను బ‌లిచేస్తారా అని సూటి ప్ర‌శ్న‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: పండుగ వేళ అర్ధ‌రాత్రి స‌మ‌యంలో జర్నలిస్టుల (Journalists) ను అరెస్టు చేయ‌డంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాల‌న చేత‌గాని స‌ర్కారు పండ‌గపూట జ‌ర్న‌లిస్టుల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని ప్ర‌శ్నించారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా అని దుయ్య‌బ‌ట్టారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఈ అరెస్టుల‌ను ప్రజాస్వామ్యంపై ముఖ్య‌మంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివ‌ర్ణించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని అభిప్రాయ‌ప‌డ్డారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా, డిజిటల్ మీడియాపై కేసును విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేసి, ఎవ‌రిని కాపాడుతున్నారో, ఎవ‌రిని వేటాడుతున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. పాల‌కుల స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమ‌ని అన్నారు. "రేవంత్ రెడ్డీ.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ?" అని విమ‌ర్శించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement