త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వ‌డం కాంగ్రెస్ పిచ్చికి ప‌రాకాష్ట‌: నిరంజ‌న్‌రెడ్డి

Niranjan Reddy | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ (KCR)కు సిట్ (SIT) నోటీసులు ఇవ్వ‌డం కాంగ్రెస్ (Congress) పిచ్చికి ప‌రాకాష్ట అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిప‌డ్డారు. కాంగ్రెస్ చేస్తున్న పాపాల‌కు మూల్యం చెల్లించక తప్పదని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

A

Telangana | Published On Jan 29, 2026, 3.52 pm IST

Niranjan Reddy | కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వ‌డం కాంగ్రెస్ పిచ్చికి ప‌రాకాష్ట‌: నిరంజ‌న్‌రెడ్డి
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ (KCR)కు సిట్ (SIT) నోటీసులు ఇవ్వ‌డం కాంగ్రెస్ (Congress) పిచ్చికి ప‌రాకాష్ట అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిప‌డ్డారు. కాంగ్రెస్ తప్పులు ప్రజలు లెక్కిస్తున్నారని అన్నారు. ఆ పార్టీ చేస్తున్న పాపాల‌కు మూల్యం చెల్లించక తప్పదని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. సాక్షులుగా విచారిస్తున్నాం అంటూ దోషులుగా ప్రచారం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో సిట్ తీరు, కాంగ్రెస్, ఒక వర్గం మీడియా పాత్ర అనుమానాస్పదంగా ఉందని అన్నారు. విచారణ పేరుతో రెండేళ్లుగా బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని విమ‌ర్శించారు. కొండను తవ్వాం అని చెప్పుకుంటూ ఎలుకను కూడా పట్టలేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు, ప్రచారానికి పొంతన లేకుండా ఉందని అన్నారు.
రెండేళ్లుగా అభివృద్ధి లేదని, సంక్షేమం అస‌లే లేద‌ని, కానీ సిట్‌ల విచార‌ణ పేరుతో ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఫిబ్రవరి వస్తున్నా రైతుభరోసా ఊసెత్తడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తులం బంగారం ఇవ్వమని చేతులు ఎత్తేశారని, పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కళ్యాణలక్ష్మి పైస‌లు వ‌స్తున్నాయ‌ని వాపోయారు. యూరియా దొరకక రైతులు అల్లాడుతున్నారని, చంటిబిడ్డలతో యూరియా కోసం లైన్లో నిలబడుతున్నారని వివ‌రించారు. ఫించన్ల పెంపు మాటెత్తడం లేదని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు మాయం చేశారని చెప్పారు. పాలనను గాలికి వదిలి రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలని ఆశ చూపి, ఉన్న పథకాలను గంగలో కలిపారని మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement